News October 14, 2025
ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం: సివిల్ సప్లై అధికారి

ములుగు జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్దం చేసినట్లు జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి ఫైజల్ హుస్సేని తెలిపారు. జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుండగా, మొత్తం 176 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా, ధాన్యం కొనుగోలుకు కావల్సిన 46 లక్షల గన్నీ బ్యాగులకు గానూ, 30.39 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామని అన్నారు.
Similar News
News October 14, 2025
తాజా రౌండప్

* తప్పిపోయిన పిల్లల కేసుల పర్యవేక్షణకు ప్రతి రాష్ట్రంలో నోడల్ అధికారులను నియమించాలని SC ఆదేశాలు
* ఈ నెల 18న BC సంఘాలు నిర్వహించే బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన TG జనసమితి చీఫ్ కోదండరాం
* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రెండో రోజు 10 మంది నామినేషన్లు దాఖలు
* TG ఇరిగేషన్ శాఖలో 106 మంది అధికారులు క్షేత్రస్థాయిలో బదిలీ
* నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 81, సెన్సెక్స్ 297 పాయింట్లు పతనం
News October 14, 2025
యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సైనికుడు మృతి

రాజస్థాన్లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సంగడిగుంటకు చెందిన తేజ్ భరద్వాజ్ మరణించారు. దేశ సేవపై మక్కువతో సైన్యంలో చేరిన భరద్వాజ్ ప్రమాదవశాత్తు మరణించడం సైన్యం, కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం ఇవాళ సాయంత్రానికి సంగడిగుంటలోని నివాసానికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
News October 14, 2025
భీమ్గల్: పాఠశాల బస్సు కిందపడి బాలుడి మృతి

భీమ్గల్ మండలం రహత్నగర్లో మంగళవారం కృష్ణవేణి స్కూల్ బస్సు కిందపడి శ్రీకాంత్(3) అనే బాలుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం.. ఉదయం పాఠశాలకు అతని అన్నను బస్సులో ఎక్కించడానికి కుటుంబీకులతో వెళ్లిన సమయంలో బస్సు చక్రాల కింద పడ్డాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడు కోమాలోకి వెళ్లడంతో వైద్యం కోసం NZB తీసుకెళ్లగా మృతి చెందాడు.