News November 11, 2025
ధాన్యం కొనుగోలు కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

యాదాద్రి భువనగిరి(D) బీబీనగర్(M) రుద్రవెల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హనుమంత రావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రానికి వచ్చిన, ఇంకా రావాల్సిన ధాన్యం వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు తేమశాతం తప్పనిసరిగా తనిఖీ చేసి, నాణ్యత కలిగిన ధాన్యాన్ని వెంటనే కాంటా వేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు లారీలలో మిల్లులకు తరలించాలన్నారు.
Similar News
News November 11, 2025
‘సిద్దిపేట జిల్లాకు అందెశ్రీ జిల్లాగా పేరు మార్చాలి’

సిద్దిపేట జిల్లా పేరును అందెశ్రీ సిద్దిపేట జిల్లాగా పేరు మార్చాలని సీఎం రేవంత్ రెడ్డిని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర నాయకుడు గాదగోని చక్రధర్ గౌడ్ కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
News November 11, 2025
జూబ్లీ బైపోల్: 5PM UPDATE.. 47.16% పోలింగ్ నమోదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ మరికాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 47.16% పోలింగ్ నమోదు అయినట్లు స్పష్టం చేశారు. ఆయా పోలింగ్ బూత్లలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. మరో అరగంట పోలింగ్కు అవకాశం ఉండడంతో పర్సంటేజ్ ఇంకా పెరగనుంది.
News November 11, 2025
జూబ్లీ బైపోల్: 5PM UPDATE.. 47.16% పోలింగ్ నమోదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ మరికాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 47.16% పోలింగ్ నమోదు అయినట్లు స్పష్టం చేశారు. ఆయా పోలింగ్ బూత్లలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. మరో అరగంట పోలింగ్కు అవకాశం ఉండడంతో పర్సంటేజ్ ఇంకా పెరగనుంది.


