News November 4, 2025
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్తకోట(M) పాలెం, కానాయపల్లి గ్రామాల్లోని చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వెంటనే సీరియల్ నంబర్ల వారీగా ఎంత ధాన్యం తెచ్చారు, తేమ శాతం ఎంత ఉంది అనేది రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.
Similar News
News November 4, 2025
తిరుపతిలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

తిరుపతి రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం నెల్లూరు స్టోన్ హౌస్ పేటకు చెందిన విద్యార్థి సాయి చందు(20) హాస్టల్ టెర్రస్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కోసం తండ్రికి ఫోన్ చేసిన కొన్ని గంటల్లోనే మృతి చెందాడు. ప్రేమ వ్యవహారం మృతికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
News November 4, 2025
భవిత సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

దివ్యాంగ పిల్లల విద్యాప్రమాణాలు మెరుగుపరచేందుకు భవిత సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం అన్నారు. నవంబర్ 20 నాటికి మరమ్మతులు, పెయింటింగ్, మౌలిక వసతుల పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి సెంటర్లో విద్యార్థుల సంఖ్యను పెంచి, యాక్టివిటీలను రెగ్యులర్గా నిర్వహించాలన్నారు. వినూత్న పద్ధతుల్లో బోధన అందించి, స్పష్టమైన మార్పు కనిపించేలా చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News November 4, 2025
చంద్రబాబు, లోకేశ్పై జగన్ సెటైర్లు

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా CM చంద్రబాబు, మంత్రి లోకేశ్పై YCP అధినేత జగన్ సెటైర్లు వేశారు. ‘ఇంత విపత్కర పరిస్థితిలో సీఎం ఒక రోజు వస్తాడు. అలా చాపర్లో తిరుగుతాడు. మరుసటి రోజు లండన్కు పోతాడు. ఆయన కొడుకు ఆస్ట్రేలియా నుంచి వస్తాడు. మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడటానికి పోతాడు’ అని ఎద్దేవా చేశారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.


