News March 20, 2025

ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలపై వనపర్తి కలెక్టర్ సూచన 

image

రైతుల నుంచి 2024-25 రబీ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లుతో కలిసి రబీ సీజన్ వరి కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Similar News

News March 20, 2025

రూ.61 లక్షల వెహికల్ అలవెన్స్.. స్మితకు నోటీసులు?

image

IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ వెహికల్ అలవెన్స్ కోసం వర్సిటీ నుంచి నెలకు రూ.63వేలు తీసుకోవడంపై జయశంకర్ వర్సిటీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎంవో అడిషనల్ సెక్రటరీ హోదాలో స్మితా 2016-24 వరకు రూ.61 లక్షలు అద్దె కింద తీసుకున్నట్లు తాజాగా ఆడిట్‌లో తేలింది. దీనిపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె నుంచి డబ్బులు తిరిగి రాబట్టేందుకు త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.

News March 20, 2025

యూనివర్సిటీకి బడ్జెట్‌లో నిధులు ఎంతంటే.?

image

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి రూ.50కోట్లు, జీతభత్యాలకు రూ.145.62కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్‌లో జీతభత్యాలకు రూ.135కోట్లు, రూ.500కోట్లు ప్రతిపాదించగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ బడ్జెట్‌‌లో ప్రవేశ పెట్టిన నిధులను యూనివర్సిటీకి ఖర్చు చేస్తారో, లేదో.. వేచి చూడాలి

News March 20, 2025

ఏలూరు: వైసీపీకి కార్పొరేటర్ రాజీనామా

image

ఏలూరు 7వ డివిజన్ కార్పొరేటర్ పిల్లంగోళ్ల శ్రీదేవి వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను అధినేత జగన్‌కు పంపినట్లు ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల తన సోదరి, రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్‌పర్సన్ శ్రీలక్ష్మిని ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త అవమానించారని అన్నారు. ఆమెపై అసత్య ప్రచారాలు చేసి సస్పెండ్ చేయడం తనను ఎంతో బాధించిందని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

error: Content is protected !!