News March 4, 2025

ధ్రువీకరణ పత్రం అందుకున్న ‘గాదె’

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన గాదె శ్రీనివాస నాయుడుకి సోమవారం రాత్రి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ధ్రువీకరణ పత్రం అందజేయడంలో జాప్యం జరగడంతో పీఆర్టీయూ ఉపాధ్యాయులు విశాఖ ఏయూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. నాలుగు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయన మూడుసార్లు విజయం సాధించారు.

Similar News

News September 16, 2025

MGBS మెట్రో స్టేషన్‌లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రం

image

దేశంలోనే పాస్‌పోర్ట్ జారీలో 5వ స్థానంలో తెలంగాణ నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని MP అసదుద్దీన్ ఒవైసీ, MP అనిల్ కుమార్ యాదవ్, MLC రియాజుల్ హసన్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలసి మంత్రి ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారి మెట్రోలో ప్రారంభమైన పాస్ పోర్ట్ కేంద్రం ఇదే అని ఆయన వెల్లడించారు.

News September 16, 2025

కేజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

image

కేజీహెచ్‌లో మంగళవారం అరుదైన శస్త్ర చికిత్స విజయవంతమైంది. అల్లూరి జిల్లా జి.మాడుగులకు చెందిన ఆడ శిశువుకు తల వెనుక ‘జెయింట్ ఆక్సిపిటల్ మెనింజోఏన్సఫలోసిల్’ గడ్డ ఉంది. కేజీహెచ్‌లో డా. ప్రేమ్‌జిత్ రే నేతృత్వంలోని న్యూరో సర్జరీ బృందం ఆపరేషన్ చేసి, బయటకు వచ్చిన మెదడు భాగాన్ని తొలగించారు. పదివేల మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధి చికిత్స విజయవంతమైందని, శిశువు కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.

News September 16, 2025

నర్సాపూర్: ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

image

నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల వద్దకు వెళ్లి వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మందుల నిల్వలు పరిశీలించారు, పలు రికార్డులను తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని సూచించారు.