News March 4, 2025
ధ్రువీకరణ పత్రం అందుకున్న ‘గాదె’

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన గాదె శ్రీనివాస నాయుడుకి సోమవారం రాత్రి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ధ్రువీకరణ పత్రం అందజేయడంలో జాప్యం జరగడంతో పీఆర్టీయూ ఉపాధ్యాయులు విశాఖ ఏయూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. నాలుగు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయన మూడుసార్లు విజయం సాధించారు.
Similar News
News March 4, 2025
రష్మిక మందన్న vs కాంగ్రెస్: ఆమెకు మద్దతుగా BJP, JDS

కన్నడ సినీ పరిశ్రమ, నటి <<15639271>>రష్మిక<<>> మందన్నపై కాంగ్రెస్ మంత్రులు, MLAల వ్యాఖ్యలను BJP, JDS ఖండించాయి. కర్ణాటక LoP, BJP నేత R అశోకా, JDS నేత నిఖిల్ కుమార స్వామి ఆమెకు మద్దతు ప్రకటించారు. మీరు చెప్పినట్టల్లా ఆడటానికి నటులేమీ కాంగ్రెస్ కార్యకర్తలు కారని విమర్శించారు. ప్రభుత్వం నిర్వహించిన కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్కు ఆమె సహా కొందరు నటులు రాకపోవడంతో ఈ వివాదం మొదలైంది. DY CM డీకే సినీ పరిశ్రమను హెచ్చరించారు.
News March 4, 2025
జర్మనీలో తూ.గో. మంత్రికి ఘన స్వాగతం

జర్మనీ డి బెర్లిన్ ఎక్స్పో సెంటర్ సిటీలో ప్రారంభమయ్యే ఐటీబీ బెర్లిన్-2025 సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్కు జర్మనీలో జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో పర్యటక రంగంలో పెట్టుబడులు కోసం ఈ సదస్సులో చర్చించడం జరుగుతుంది. మంత్రితో పాటు ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి పాల్గొంటారు.
News March 4, 2025
పెద్దపల్లి: LRS ఫీజులపై 25% మినహాయింపు: కమిషనర్

పెద్దపల్లి పట్టణ ప్రజలు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) పరిధిలో ఫీజులు మార్చి 31లోపు చెల్లిస్తే 25% మినహాయింపు పొందవచ్చని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వం అందించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఆస్తులను రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోపు ఫీజులు చెల్లించి ప్రయోజనం పొందాలని కమిషనర్ కోరారు.