News March 4, 2025

ధ్రువీకరణ పత్రం అందుకున్న ‘గాదె’

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన గాదె శ్రీనివాస నాయుడుకి సోమవారం రాత్రి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ధ్రువీకరణ పత్రం అందజేయడంలో జాప్యం జరగడంతో పీఆర్టీయూ ఉపాధ్యాయులు విశాఖ ఏయూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. నాలుగు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయన మూడుసార్లు విజయం సాధించారు.

Similar News

News February 23, 2026

ప్రభుత్వ కార్యాలయాల్లో Dy.CM ఫొటో… నేడు క్యాబినెట్లో చర్చ!

image

TG: GOVT ఆఫీసులలో Dy.CM భట్టి విక్రమార్క ఫొటో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం CM ఫొటో మాత్రమే ఉంది. ఇకపై Dy.CM ఫొటో కూడా ఏర్పాటు చేసేలా నేటి క్యాబినెట్‌ భేటీలో చర్చించే అవకాశం ఉంది. APలో Dy.CM ఫొటో ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడం తెలిసిందే. దానివల్ల నష్టం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో TGలో పెట్టినా న్యాయపరంగా ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది.

News February 23, 2026

శ్రీకాకుళం: ‘ఇంటర్ పరీక్షకు 662 మంది డుమ్మా’

image

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం మొదటి రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 662 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 71 కేంద్రాల్లో 20,377 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 19,715 మంది హాజరైనట్లు తెలిపారు. 96.75 హాజరు శాతం నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరుగినట్లు, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదన్నారు.

News February 23, 2026

కర్ణాటకలో 16 ఏళ్లలోపు వారికి మొబైల్ ఫోన్ నిషేధం?

image

స్మార్ట్ ఫోన్స్ అడిక్షన్ విద్యార్థుల్లో పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 16 ఏళ్లలోపు వారికి ఫోన్‌ వాడకాన్ని నిషేధించాలని యోచిస్తోంది. ఈ అంశంపై అభిప్రాయాలు తెలపాలని అన్ని ప్రభుత్వ వర్సిటీల వీసీలను సీఎం సిద్దరామయ్య కోరారు. ఆస్ట్రేలియాతో సహా పలు దేశాలు ఇప్పటికే విద్యార్థులకు మొబైల్ ఫోన్లను నిషేధించిన అంశాన్ని గుర్తు చేశారు.