News March 21, 2025
నందనవనంగా అమరావతిని మార్చుకుందాం

AP రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. దాదాపు 30 వేల ఎకరాల్లో భారీ ప్రాజెక్టుల సమాహారం ఇది. అయితే మహానగరంగా ఎదిగే ఏ ప్రాంతమైనా ఎదుర్కొనే ప్రధాన సమస్య పర్యావరణం. అందుకు ప్రభుత్వమే కాదు మనమూ నైతిక బాధ్యత వహించాలి. ప్రకృతితో స్నేహం చేస్తూ ఇంటికో చెట్టు పెంచాలి. ప్రకృతి ఒడిలో ఓలలాడేలా, పచ్చదనం విరబూసే నందనవనంలా అమరావతిని అలంకరించాలి. మీరేమంటారు.
నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.
Similar News
News March 28, 2025
సెలవు రోజుల్లోనూ పని చేయనున్న కార్యాలయాలు

దేశవ్యాప్తంగా ఈనెల 29, 30, 31 తేదీల్లో ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసులు పనిచేయనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈనెల 31తో ముగియనుండగా, ఆలోగా పన్ను చెల్లింపుదారులు పెండింగ్లో ఉన్న తమ ట్యాక్స్ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సెలవులున్నప్పటికీ కార్యాలయాలు పని చేస్తాయని CBDT తెలిపింది. అటు ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలూ 30, 31 తేదీల్లో పనిచేయనున్నాయి.
News March 28, 2025
IPL: నేడు కింగ్స్తో ఛాలెంజర్స్ ఢీ

IPL-2025లో భాగంగా ఇవాళ రా.7.30 గంటలకు చెన్నై వేదికగా CSK, RCB మధ్య మ్యాచ్ జరగనుంది. స్పిన్నర్లకు సహకరించే ఈ పిచ్పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాల్లేవు. ఈ సీజన్లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ విజయంతో శుభారంభం చేశాయి. స్పిన్నర్ నూర్ అహ్మద్ నుంచి RCB బ్యాటర్లకు ముప్పు పొంచి ఉంది. RCB పేసర్ భువనేశ్వర్ నేటి మ్యాచులో బరిలోకి దిగుతారని సమాచారం. ఇందులో ఏ జట్టుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? COMMENT
News March 28, 2025
బాలికల గురుకులాల్లో పురుష సిబ్బంది ఉండొద్దు: ఎస్సీ సొసైటీ

TG: SC బాలికల గురుకులాలు, కాలేజీల్లోని అన్ని పోస్టుల్లో మహిళా సిబ్బందే ఉండాలని SC గురుకుల సొసైటీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీవో 1274 ఉత్తర్వులను యథావిధిగా అమలు చేయాలని తెలిపింది. బాలికల విద్యాలయాల్లో ఎవరైనా పురుష సిబ్బంది కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బాలుర స్కూళ్లు, కాలేజీలను జనరల్గా పరిగణించి వాటిలోని పోస్టులను మహిళలు, పురుషులతో భర్తీ చేస్తామని పేర్కొంది.