News July 5, 2024

నందికొట్కూరులో వైసీపీకి భారీ షాక్

image

నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మున్సిపల్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు 12 మంది కౌన్సిలర్లు శుక్రవారం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బైరెడ్డి మాట్లాడుతూ.. ఎవరి బెదిరింపులకూ భయపడవద్దని, అందరం కలిసి పేదల అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

Similar News

News July 8, 2024

శ్రీశైలంలో ఆ ఐదు రోజుల స్పర్శ దర్శనం నిలుపుదల

image

శ్రావణమాసంలో ఆగస్టు 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ మల్లికార్జున స్వామి అలంకార దర్శనం మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంటుందని ఆయన ఈవో పెద్దిరాజు తెలిపారు. ఐదు రోజులపాటు స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులకు అనుమతి ఉండదన్నారు. నెలలో 16 రోజుల పాటు అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. వేకువజామున 4.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తామన్నారు.

News July 8, 2024

భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రావణమాసం ఏర్పాట్లు

image

శ్రీశైలం ఆలయానికి శ్రావణమాసంలో వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ ఈవో పెద్దిరాజు ఆదేశించారు. శ్రావణమాసం ఏర్పాట్లలో భాగంగా సోమవారం ఆలయ సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారికి శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.

News July 8, 2024

శ్రీశైలంలో ఉద్యోగుల విధుల్లో మార్పులు

image

పరిపాలన సౌలభ్యంలో భాగంగా శ్రీశైలం దేవస్థానంలో వివిధ కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల స్థానాలను మారుస్తూ ఈవో పెద్దిరాజు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఆలయంలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న 50మంది రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ.. ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు విధులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు.