News October 26, 2024
నందిపేట్: ప్రమాదవశాత్తు గోదావరిలో పడి వృద్ధుడు మృతి

ప్రమాదవశాత్తు గోదావరిలో పడి ఆలూరు మండలానికి చెందిన వృద్ధుడు కండేల నరసయ్య (70) మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. నందిపేట్ మండలంలోని ఉమ్మేడ పంచముఖి హనుమాన్ మందిరం బ్రిడ్జి దగ్గర ప్రమాదవశాత్తు నరసయ్య గోదావరిలో పడి మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ హరిబాబు తెలిపారు.
Similar News
News February 13, 2026
NZB: కొన్ని గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. మొత్తం 4,95,485 మంది ఓటర్లకు గాను 3,06,697 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల జయాపజయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. గెలుపు ధీమాతో ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కల్లో మునిగిపోయారు.
News February 13, 2026
NZB: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

రాష్ట్రస్థాయి సీఎం కప్ విలువిద్య పోటీలకు గురువారం నిజామాబాద్లో ఖేలో ఇండియా విలువిద్య శిక్షణ కేంద్రం రాజారాం స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు ఖమ్మంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొంటారు. కాంపౌండ్, రికవ్ ఇండియన్ రౌండ్ విభాగాల్లో ఎంపికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విలువిద్య శిక్షకులు మురళి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
News February 13, 2026
NZB: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

రాష్ట్రస్థాయి సీఎం కప్ విలువిద్య పోటీలకు గురువారం నిజామాబాద్లో ఖేలో ఇండియా విలువిద్య శిక్షణ కేంద్రం రాజారాం స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు ఖమ్మంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొంటారు. కాంపౌండ్, రికవ్ ఇండియన్ రౌండ్ విభాగాల్లో ఎంపికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విలువిద్య శిక్షకులు మురళి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


