News July 17, 2024

నందిపేట్ మండలంలో భారీ చోరీ

image

నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో గుర్తు తెలియని దొంగలు మంగళవారం అర్ధరాత్రి దాటాక తాళం వేసిన మూడిళ్లలో భారీగా బంగారం, నగదు అపహరించుకుపోయారు. సుమారు 20 తులాల బంగారం, 18 తులాల వెండి, రూ.11 లక్షల నగదు అపహరించినట్లు బాధిత కుటుంబాలు తెలిపారు. కాగా చోరీ ఆనవాళ్లు తెలియకుండా దొంగలు ఇండ్లలో కారంపొడి చల్లి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 28, 2026

NZB: ప్రసూతి సేవల విభాగాన్ని వెంటనే MCHలోకి మార్చాలి

image

GGHలో కొనసాగుతున్న ప్రసూతి సేవల విభాగాన్ని వెంటనే MCHలోకి మార్చాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన మాతాశిశు ఆరోగ్య కేంద్రం (MCH), క్రిటికల్ కేర్ యూనిట్‌లతో కూడిన భవన సముదాయాన్ని పరిశీలించారు. సుదీర్ఘ కాలం నుంచి పలు పనులు పెండింగ్‌లోనే ఉండడం గమనించిన సుదర్శన్ రెడ్డి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News February 28, 2026

NZB: వారిపై చర్యలు తీసుకోవాలి: సుదర్శన్ రెడ్డి

image

లేవీ అందించడంలో విఫలమైన 57మంది డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి రూ.276 కోట్లు రికవరీ చేసేందుకు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రస్తుత సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించే వరి ధాన్యాన్ని నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్‌లను గుర్తించాలన్నారు.

News February 28, 2026

NZB: గోడౌన్‌లు సిద్ధం చేయాలి

image

ప్రస్తుత సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించే వరి ధాన్యాన్ని నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్‌లను సిద్ధం చేయాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యం, ఎఫ్సీఐకి ఎంత పరిమాణంలో బియ్యం నిల్వలు అందించారు అని ఆరా తీశారు.