News April 16, 2025
నందిమల్ల: త్రిశంకు స్వర్గంలా జూరాల ప్రాజెక్టు

వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల సమీపంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు త్రిశంకు స్వర్గంలా మారిపోయింది. ఎగువ నుంచి నీరు రాకపోవడంతో ప్రాజెక్టులు నిల్వ నీరు లేకపోవడం, తాగునీటికి మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేయడం, ఉన్న నీటితో సాగునీరుకు రైతులకు ఎక్కువ నీటిని విడుదల చేయలేకపోవడంతో జూరాల ప్రాజెక్టు త్రిశంక స్వర్గంలా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Similar News
News November 6, 2025
10 రోజుల్లో నష్టపరిహారం: వికారాబాద్ కలెక్టర్

NH-167 రోడ్డు విస్తరణలో కట్టడాలు (ఆస్తులు) కోల్పోతున్న వారికి 10 రోజుల్లో నష్టపరిహారం అందజేస్తామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో నిర్వాసితులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అయితే 107 మందికి చెందిన 55,114 స్క్వేర్ ఫీట్ల స్థల సేకరణకు ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లింగ్య నాయక్ పాల్గొన్నారు.
News November 6, 2025
ఫేక్ వీడియో కాల్స్తో మోసాలు.. జాగ్రత్త: పరిగి డీఎస్పీ

నకిలీ వీడియో కాల్స్ ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నాయని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ హెచ్చరించారు. తెలియని నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే స్పందించొద్దని ప్రజలకు సూచించారు. కొందరు వ్యక్తులు నగ్నంగా మాట్లాడి, ఆ దృశ్యాలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతుంటారని తెలిపారు. ఇలాంటి మోసాలకు భయపడకుండా వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాలని, సైబర్ ఫిర్యాదుల కోసం ‘1930’కు కాల్ చేయాలని డీఎస్పీ కోరారు.
News November 6, 2025
రికార్డులు బద్దలు.. బిహార్ చరిత్రలో అత్యధిక పోలింగ్

అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బిహారీలు రికార్డులు బద్దలుకొట్టారు. రాష్ట్ర చరిత్రలో అత్యధిక పోలింగ్ శాతాన్ని నమోదు చేశారు. ఇవాళ జరిగిన తొలి విడత పోలింగ్లో ఏకంగా 64.66శాతం ఓటింగ్ నమోదైంది. 1998 లోక్సభ ఎన్నికల్లో నమోదైన 64.6శాతమే ఇప్పటివరకు అత్యధికం. గత ఎలక్షన్స్(2020)లో 57.29శాతం పోలింగ్ రికార్డవగా ఈసారి 7శాతానికి పైగా ఎక్కువ ఓట్లు పోలవడం విశేషం.


