News August 14, 2025
నంద్యాలలో వెలుగులోకి నకిలీ లెటర్ల మోసం?

నంద్యాల కేంద్రంగా టీటీడీ దర్శనం కోసం నకిలీ లెటర్లు తయారుచేసి రూ.వేలకు అమ్ముకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. బైర్మల్ వీధిలో అద్దెకు నివసించే ఓ యువకుడు ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధుల పేర్లతో నకిలీ లెటర్లు తయారు చేస్తున్నట్లు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు గుర్తించారు. తాజాగా ఎంపీ బైరెడ్డి శబరి పేరుతో నకిలీ లెటర్ తయారు చేసి నెల్లూరు వాసులకు ఇచ్చినట్లు తెలిసింది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.
Similar News
News August 14, 2025
ఆమనగల్లో రూ.4 కోట్ల BC హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన

NGKL ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, వంశీకృష్ణ కలిసి ఆమనగల్ మండల కేంద్రంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించబోయే BC హాస్టల్కు శంకుస్థాపన చేశారు. ఈ నిధులు అరబిందో పార్మా కంపెనీ నుంచి CSR ఫండ్ ద్వారా ఎంపీ మల్లు రవి ప్రత్యేక చొరవతో మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
News August 14, 2025
విశాఖ: రెండు రోజుల పాటు మాంసం విక్రయాలు బంద్

విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని మాంసం, చేపలు, చికెన్ దుకాణాలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి. నరేశ్ కుమార్ గురువారం తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం, కృష్ణాష్టమి సందర్భంగా శనివారం అన్ని మాంసం దుకాణాలను, జంతు వధశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని వ్యాపారులు గమనించాలని ఆయన సూచించారు.
News August 14, 2025
వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూటమిదే విజయం: మంత్రి

AP: వచ్చే ఎన్నికల్లో(అసెంబ్లీ, పార్లమెంటు) పులివెందులలో కూటమిదే విజయమని మంత్రి పార్థసారధి ధీమా వ్యక్తం చేశారు. ‘పులివెందుల ZPTC ఎన్నికల్లో TDP విజయం 2029 ఎన్నికల్లో కూటమి విజయానికి తొలి మెట్టు. YCPకి ఇది బలమైన నియోజకవర్గం. ఓటింగ్ను బహిష్కరించాలని ఆ పార్టీ చెప్పినా 55-65% పోలింగ్ నమోదైంది. ప్రజల్లో YCPపై ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనం. పోలీసులను జగన్ కించపరచడం సరైంది కాదు’ అని వ్యాఖ్యానించారు.