News January 23, 2026
నంద్యాల కలెక్టరేట్లో జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ

భారత ఎన్నికల సంఘం స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో వివిధ శాఖల సిబ్బందితో ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఎన్నికలోనూ కులమతాలకు, ప్రలోభాలకు తీతగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగిస్తామని ఈ సందర్భంగా సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.
Similar News
News February 17, 2026
FLASH.. తొర్రూరులో ఛైర్మన్ ఎన్నికకు లక్కీ డ్రా తీసే అవకాశం?

తొర్రూరు మున్సిపాలిటీ బాధ్యతలను ఎంపీ రఘురామరెడ్డి, MLAలు రాజేందర్ రెడ్డి, నాగరాజుకు TPCC అప్పగించారు. అయితే, ఇప్పటికే BRSకు 9 మంది కౌన్సిలర్లు ఉండగా.. ఎక్స్ అఫిషియోతో కలిపి కాంగ్రెస్కు 9 మంది అయ్యారు. రెండు పార్టీలకు సమాన బలం ఉండటంతో ఛైర్మన్ ఎన్నికకు లక్కీ డ్రా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి ఘర్షణల నేపథ్యంలో తొర్రూరులో BNS-163 సెక్షన్ అమలు చేశారు. దాదాపు వెయ్యి మంది పోలసులు మోహరించారు.
News February 17, 2026
నారాయణపేట: ఏళ్ల కల నిజమైన వేళ!

ఏడేళ్ల క్రితం NRPT జిల్లావాసుల ఎదురుచూపులకి తెరపడింది. సొంత జిల్లా కోసం ప్రజలు సాగించిన దీర్ఘకాల పోరాటం విజయవంతమైంది. MBNR విభజన తర్వాత ర్యాలీలు, బంద్లు, ఆమరణ దీక్షలతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. “మాకు మా జిల్లా కావాలి” నినాదంతో విద్యార్థులు, నేతన్నలు, వ్యాపారులు ఒక్కటయ్యారు. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ అప్పటి CM KCR ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 17న జిల్లా ప్రకటించగా పట్టణం సంబరాల్లో మునిగిపోయింది.
News February 17, 2026
MDK: భార్య ఛైర్పర్సన్.. భర్త కౌన్సిలర్!

రామాయంపేట మున్సిపాలిటీలో భార్య భర్తలు మున్సిపాలిటీలో అడుగు పెట్టారు. భార్య గజవాడ లావణ్య ఒకటో వార్డు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. భర్త నాగరాజు ఏడవ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొంది మున్సిపాలిటీలో రెండవసారి అడుగుపెట్టారు. భార్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఛైర్ పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భార్య ఛైర్ పర్సన్, భర్త కౌన్సిలర్గా కొనసాగుతున్నారు.


