News November 17, 2025
నంద్యాల: ‘కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఇవ్వాలి’

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, జిల్లా కార్యదర్శి రామచంద్రుడు డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాలలో కలెక్టర్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరల అమలు, పంట నష్టపరిహారం చెల్లింపు, ఎన్యూమరేషన్లో లోపాలను సవరించాలని కోరారు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 17, 2025
స్టూడెంట్స్ క్లబ్ విధానం స్ఫూర్తిదాయకం: బండి సంజయ్

కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న స్టూడెంట్స్ క్లబ్ విధానం రాష్ట్రానికి స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం కళాభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు టీ షర్టులు, బ్యాడ్జీలు పంపిణీ చేశారు. ఈ విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎంకు లేఖ రాస్తానని తెలిపారు. వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న కలెక్టర్ను ఆయన అభినందించారు.
News November 17, 2025
స్టూడెంట్స్ క్లబ్ విధానం స్ఫూర్తిదాయకం: బండి సంజయ్

కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న స్టూడెంట్స్ క్లబ్ విధానం రాష్ట్రానికి స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం కళాభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు టీ షర్టులు, బ్యాడ్జీలు పంపిణీ చేశారు. ఈ విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎంకు లేఖ రాస్తానని తెలిపారు. వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న కలెక్టర్ను ఆయన అభినందించారు.
News November 17, 2025
ఢిల్లీ బ్లాస్ట్లో 15మంది మృతి: పోలీసులు

ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో NIA, ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మరోవైపు మృతుల సంఖ్యపై కూడా ఓ స్పష్టతనిచ్చారు. ఇప్పటివరకు ఈ పేలుడు ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అటు సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి సహకరించాడన్న అనుమానంతో కశ్మీరుకు చెందిన అమీర్ రషీద్ అలీని నిన్న NIA <<18306148>>అరెస్టు <<>>చేసిన విషయం తెలిసిందే. అతడిని కశ్మీర్కు తీసుకెళ్లి తదుపరి విచారణ కొనసాగించనుంది.


