News May 23, 2024

నంద్యాల: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

image

ఉపాధి పనులకు వెళ్లి అస్వస్థతకు గురైన వ్యక్తి గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన సంపంగి రవిశేఖర్ ఉదయం ఉపాధి పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా అస్వస్థతకు గురికావడంతో తోటి కూలీలు చికిత్స నిమిత్తం స్థానిక వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. అయితే కోలుకోలేక గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News October 12, 2024

కర్నూలు జిల్లాలో కిలో టమాటా @రూ.20

image

కర్నూలు జిల్లాలో ఇటీవల రూ.100 పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. పత్తికొండ మార్కెట్‌లో శనివారం కిలో టమాటా ధర రూ.20కి పడిపోయింది. కాగా ఇటీవల టమాట ధరలు పెరగడంతో ప్రభుత్వం సబ్సిడి కేంద్రాల్లో తక్కవ ధరలకే టమాటాలను విక్రయించిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News October 12, 2024

కర్నూలు జిల్లాలో మద్యం షాపులకు 5,128 దరఖాస్తులు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులకు దరఖాస్తు గడువు శుక్రవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,128 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు 3,013 దరఖాస్తులు రాగా, నంద్యాల జిల్లాలో 105 దుకాణాలకు 2,115 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 14న కర్నూలు జడ్పీ సమావేశ హాల్‌లో లక్కీ డిప్ తీయనున్నారు.

News October 12, 2024

హొళగుంద: దేవరగట్టులో నేడు కర్రల సమరం

image

ఇరు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన దేవరగట్టు కర్రల సమరం దసర సందర్భంగా శనివారం జరగనుంది. మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం అనంతరం జరిగే బన్ని ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని స్థానికులు తెలిపారు. బన్ని ఉత్సవాల్లో మూడు గ్రామాలు ఒక వైపు మరో ఏడు గ్రామాలు ఒకవైపు నుంచి తలపడుతాయి. కాగా కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.