News May 25, 2024
నంద్యాల: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
డోన్ జాతీయ రహదారిలోని ఉంగరానిగుండ్ల వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోరు వర్షంలో బైక్పై వెళుతున్న ముగ్గురు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో ముని, ప్రభాకర్, దశరథ అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాకి చేరుకొని ప్రమాద ఘటనను పరిశీలించారు.
Similar News
News October 11, 2024
ఆడపిల్లల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత: కలెక్టర్
ఆడపిల్లల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని కలెక్టర్ రంజిత్ బాషా పిలుపునిచ్చారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్లో అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం భేటీ బచావో-భేటి పడావో కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలు చేస్తోందన్నారు. ఆడపిల్లలను మంచి చదువులు చదివించాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు.
News October 11, 2024
జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన బెళగల్ విద్యార్థి
కోసిగి మండలం దొడ్డి బెళగల్కు చెందిన జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సందిప్ ఆగ్రాలో జరిగిన జాతీయ స్థాయి లాక్రోస్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీయాన్ కుమారి అభినందించారు. ఆమె మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన స్థాయిలో ఆడాలని ఆకాంక్షించారు.
News October 11, 2024
నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజా
నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో శుక్రవారం ఆయుధ పూజ చేశారు. అర్మ్డ్ రిజర్వ్ విభాగంలో గల ఆయుధాగారంలో దుర్గామాతకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలకు ఎస్పీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.