News November 4, 2024
నంద్యాల చిత్రకారుడికి అవార్డు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_112024/1730639425074_50015707-normal-WIFI.webp)
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ వేసిన దేవసుర చిత్రానికి భారతీయ చిత్రకళ అవార్డు వచ్చింది. ఆదివారం ఒంగోలులో కళాయజ్ఞ సృష్టి ఆర్ట్ అకాడమీ వారు ‘ప్రాచీన భారత్’ అనే అంశంపై పెయింటింగ్ పోటీలు, చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. 100 మంది చిత్రకారులు పాల్గొని వారు వేసిన చిత్రాలు ప్రదర్శించారు. అందులో మొదటి బహుమతి కోటేశ్కు దక్కింది.
Similar News
News December 26, 2024
మంత్రి భరత్ కుమార్తె పెళ్లిలో సీఎం చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735217685288_727-normal-WIFI.webp)
మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. హైదరాబాదులోని GMR అరేనలో జరిగిన ఈ వేడుకకు హాజరై వధూవరులు ఆర్యాపాన్య, వెంకట నలిన్ను ఆశీర్వదించారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
News December 26, 2024
శ్రీశైలానికి మంత్రి కొండా సురేఖ రాక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735204351057_60465469-normal-WIFI.webp)
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి నేడు తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ రానున్నట్లు దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. రాత్రి 7 గంటలకు మంత్రి శ్రీశైలం చేరుకుంటారని చెప్పారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.
News December 26, 2024
శిరివెళ్ళ: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735189514852_1128-normal-WIFI.webp)
శిరివెళ్ళ మండలంలోని ఎర్రగుంట్ల గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ పట్టణంలోని పద్మనాభ రావువీధికి చెందిన కళ్యాణ్(25) అనే ఇంజినీరింగ్ విద్యార్థి మరణించాడు. నంద్యాలలోని ఏవిఆర్ కళాశాలలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న అతడు బైక్పై కాలేజీకి వెళ్తుండగా కడప నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణకు చెందిన కారు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.