News March 23, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

image

☞ నంద్యాలలో వార్డెన్ పై పోక్సో కేసు నమోదు
☞ శ్రీశైలంలో ఉగాది ప్రత్యేకతపై Way2 News ఫోకస్
☞ ఎర్ర బంగారంపై వర్ష ప్రభావం
☞ శ్రీశైలంలోని కృష్ణా నదిలో మునిగి యువకుడి మృతి
☞ నల్లమల్ల అడవుల్లో కన్నడ భక్తుల సందడి
☞ కొణిదెల గ్రామానికి రూ.50 లక్షలు: పవన్ కళ్యాణ్
☞ ఆళ్లగడ్డలో కిలో చికెన్ ధర రూ.90
☞ స్థల వివాదంతోనే సుధాకర్ రెడ్డి హత్య: బండి ఆత్మకూరు ఎస్ఐ
☞ PGRS వేళలో మార్పులు: కలెక్టర్

Similar News

News November 14, 2025

35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేలు.. వరుసగా 9వ సారి ఎన్నిక!

image

బిహార్‌లో సీనియర్ నేతలు ప్రేమ్ కుమార్(BJP), బిజేంద్ర ప్రసాద్ యాదవ్(JDU) అరుదైన ఘనత సాధించారు. వరుసగా 9వ సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1990 నుంచి వారు MLAలుగా కొనసాగుతుండటం గమనార్హం. తాజా ఎన్నికల్లో గయా టౌన్ నుంచి 26,423 ఓట్ల మెజారిటీతో ప్రేమ్ కుమార్ గెలవగా, సుపౌల్‌లో 16,448 ఓట్ల ఆధిక్యంతో బిజేంద్ర గెలుపొందారు. దాదాపు 35 ఏళ్లుగా ఇద్దరూ అవే నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం.

News November 14, 2025

ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

image

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.

News November 14, 2025

అయోధ్య తరహాలో సింహాచలం డిజైన్ లైటింగ్: గంటా

image

అయోధ్య తరహాలో సింహాచలానికి డిజైన్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సింహాచలంలో ఆయన పర్యటించారు. BRTS రోడ్డులో రూ.1.37 కోట్లు వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. అడవివరం-పాతగోశాల వరకు లైటింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. దేవస్థానానికి రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో సమస్యలు పెరిగాయని, త్వరలో నియామకం జరగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.