News September 11, 2025
‘నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు.. అవసరమైతే స్కూళ్లకు సెలవు’

నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామాలలోని పాఠశాలలకు విద్యార్థులు రాలేని పక్షంలో సెలవు ఇవ్వాలని ఎంఈవోలకు సూచించారు. పరిస్థితిని బట్టి ఎంఈవోలే నిర్ణయం తీసుకోవాలన్నారు. నేడు పాఠశాలలకు సెలవు ఇస్తే.. రెండో శనివారం రోజున నడపాలని పేర్కొన్నారు.
Similar News
News September 11, 2025
సికింద్రాబాద్: కావేరీ సీడ్స్ వద్ద రైతులు నిరసన

సికింద్రాబాద్ పారడైస్లోని కావేరీ సీడ్స్ వద్ద ఛత్తీస్గఢ్ రైతులు గురువారం నిరసనకు దిగారు. కావేరి సీడ్స్ వేసి పంట నష్టపోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఎకరానికి రూ.12,000 చొప్పున పెట్టుబడి సహాయం కింద ఇచ్చారని పేర్కొన్న రైతులు ఒక్కో ఎకరానికి రూ.50 వేలు చెల్లించి నష్టాన్ని పూడ్చాలని కోరారు.
News September 11, 2025
ఐశ్వర్యారాయ్ AI ఫొటోస్ తొలగించండి: ఢిల్లీ HC

ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన పేరు, AI మార్ఫ్డ్ ఫొటోస్ను అడల్ట్ సైట్స్లో వాడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు 72 గంటల్లో సంబంధిత సైట్స్, URLsను తొలగించి సదరు ఆపరేటర్ల వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఇది ఆమె పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగిస్తుందని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని వ్యాఖ్యానించింది.
News September 11, 2025
HYD: సచివాలయంలో ఇంటర్నెట్ బంద్

సచివాలయంలో ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు శాఖల్లో పనులు స్తంభించాయి. ఉదయం నుంచి ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం నుంచి కేబుల్స్ను సిబ్బంది కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.