News October 3, 2024
నంద్యాల జిల్లాలో మహిళ హత్య

నంద్యాల జిల్లాలో మరో దారుణ హత్య జరిగింది. కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లిలో ఓ భర్త భార్యను కిరాతకంగా చంపాడు. భార్యపై అనుమానంతో గొడ్డలితో నరికి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 15, 2025
కర్నూలు జిల్లాలో బదిలీ అయిన ఎస్ఐలు వీరే!

కర్నూలు రేంజ్లో 15 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఏపీ శ్రీనివాసులు కర్నూల్ 4 టౌన్ నుంచి 3 టౌన్కు, హనుమంత్ రెడ్డి గూడూరు పీఎస్ నుంచి సీసీఎస్ కర్నూల్కు, శరత్ కుమార్ నాగలాపురం నుంచి కర్నూలు 4 టౌన్కు, ఎల్.శివాంజల్ మంత్రాలయం నుంచి సీసీఎస్కు, ఈ.మూర్తి హల్లహర్వి నుంచి DSB కర్నూల్కు, విజయ్ కుమార్ నాయక్ మద్దికేర నుంచి పత్తికొండ యూపీఎస్కు బదిలీ అయ్యారు.
News December 15, 2025
పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు జాతికి గుర్తింపు: కలెక్టర్ సిరి

తన ప్రాణత్యాగంతో తెలుగు జాతికి గుర్తింపునిచ్చిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్తో పాటు జిల్లా అధికారులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి అర్పించారు.
News December 15, 2025
రాష్ట్ర స్థాయిలో కర్నూలు జిల్లాకు మూడవ స్థానం

అనంతపురం జిల్లాలో జరిగిన ఐదవ రాష్ట్రస్థాయి డాన్స్ స్పోర్ట్స్ పోటీలలో కర్నూలు జిల్లాకు మూడో స్థానం లభించినట్లు రాష్ట్ర సంఘం కార్యదర్శి సురేంద్ర ఆదివారం తెలిపారు. జిల్లా కార్యదర్శి నాగేశ్వరి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని పోటీలలో కర్నూలు జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభ సాధించినట్లు తెలిపారు. సభ్యులు అమరేశ్, శ్రీనివాస్ తదితరులు అభినందించారు.


