News April 1, 2025
నంద్యాల జిల్లాలో 84.63% పెన్షన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నంద్యాల జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:10 గంటల సమయానికి నంద్యాల జిల్లాలో 84.63% పింఛన్ల పంపిణీ పూర్తయింది. కాగా ఇప్పటివరకు జిల్లాలో 2,14,590 మందికి గాను, 1,81,608 మందికి సచివాలయ ఉద్యోగులు పెన్షన్ సొమ్మును అందజేశారు.
Similar News
News January 4, 2026
యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయి: ఏడీఏ

మహబూబాబాద్ జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని ఏడీఏ శ్రీనివాసరావు అన్నారు. బయ్యారం మండలం ఉప్పలపాడు పీఏసీఎస్లో ఫార్మర్స్ రిజిస్ట్రీ, యూరియా నిల్వలు అందుబాటుపై నిర్వహించిన రైతు అవగాహన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఫార్మర్స్ రిజిస్ట్రీ వలన ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలవుతాయన్నారు. వ్యవసాయ సేవలు రైతులకు సమర్థవంతంగా అందుతాయని ఏడీఏ పేర్కొన్నారు. ఏవో రాజు, రైతులు పాల్గొన్నారు.
News January 4, 2026
ఇతిహాసాలు క్విజ్ – 117 సమాధానం

ఈరోజు ప్రశ్న: శ్రీకృష్ణుడి దగ్గర పాంచజన్యం అనే శంఖంతో పాటు అతి శక్తిమంతమైన విల్లు ఉంది. దాని పేరేంటి? ఎవరు తయారుచేశారు?
సమాధానం: కృష్ణుడు కురుక్షేత్రంలో ఆయుధం పట్టనని చెప్పినప్పటికీ, ఆయన దగ్గర ‘శారంగం’ అనే శక్తిమంతమైన విల్లు ఉంది. ఇది విశ్వకర్మ తయారుచేసిన దివ్యాయుధం. అర్జునుడి గాండీవమే గాక శారంగం కూడా తిరుగులేని ఆయుధంగా పేరుగాంచింది. కృష్ణుడి నందకం అనే ఖడ్గం కూడా ఉంటుంది. <<-se>>#Ithihasaluquiz<<>>
News January 4, 2026
డబ్బు సేవ్ చేయకండి.. కియోసాకి సలహా

గతంలో ఉద్యోగం ఉంటే జీవితానికి భద్రత ఉండేదని రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రైటర్ రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ‘ఇప్పుడు అన్ని పరిస్థితులు మారిపోయాయి. 2025లో పెద్ద టెక్ కంపెనీలే వేల కొద్దీ ఉద్యోగులను తొలగించాయి. అందుకే మీ ఫైనాన్షియల్ IQని పెంచుకోండి. ఎప్పుడూ డబ్బును సేవ్ చేయకండి. బంగారం, వెండి, బిట్ కాయిన్, ఇథీరియమ్ వంటి వాటిని సేవ్ చేసుకోండి’ అని ట్వీట్ చేశారు.


