News March 21, 2025

నంద్యాల జిల్లాలో TODAY TOP NEWS

image

☞ బనగానపల్లెలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు ☞ మంత్రి ఫరూక్ సతీమణి కన్నుమూత.. ప్రముఖుల సంతాపం ☞ గడిగరేవులలో గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి ☞ రోడ్డు ప్రమాదంలో 15 మంది కూలీలకు తీవ్ర గాయాలు ☞ కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు ☞ సీఎం పర్యటనకు జనరల్ ఫండ్ నుంచి రూ.2.50 కోట్లు ☞ ఫరూక్ సతీమణి చివరి కోరిక మేరకు HYDలోనే అంత్యక్రియలు ☞ బనగానపల్లె నియోజకవర్గంలో తీవ్రంగా తాగునీటి ఎద్దడి

Similar News

News March 22, 2025

వనపర్తి: పెబ్బేర్‌లో యాక్సిడెంట్.. రేషన్ డీలర్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో రేషన్ డీలర్ మృతిచెందిన ఘటన పెబ్బేర్ పరిధి అంబేడ్కర్ నగర్ రోడ్డు దగ్గర శుక్రవారం జరిగింది. SI హరిప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాలు.. చెలిమిళ్లకు చెందిన రేషన్ డీలర్ హనుమంతు కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో వనపర్తి నుంచి పెబ్బేర్‌కు చేరుకుని బస్సు దిగే క్రమంలో కిందపడి మృతిచెందాడు. మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.

News March 22, 2025

చిత్తూరు: ఒకరి ప్రాణం కాపాడిన SI

image

చిత్తూరు జిల్లాలో ఓ ఎస్ఐ ఒకరి ప్రాణం కాపాడారు. యాదమరి మండలం జోడిచింతలకు చెందిన ఓ వ్యక్తి లోన్ తీసివ్వాలని తల్లిని కోరాడు. కొన్ని రోజుల తర్వాత తీసిస్తానని ఆమె చెప్పింది. ‘నేనంటే నీకు ఇష్టం లేదు. నేను చనిపోతున్నా అమ్మ’ అంటూ అతను తల్లికి వీడియో పెట్టి ఫోన్ స్విచాఫ్ చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఈశ్వర్ యాదవ్ టెక్నాలజీ ఉపయోగించారు. మందు తాగి పడిపోయిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించి ప్రాణాలు కాపాడారు.

News March 22, 2025

బ్యాంకుల సమ్మె వాయిదా

image

ఈనెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ప్రకటించింది. వారంలో ఐదు రోజుల పని, అన్ని క్యాడర్లలో తగినన్ని నియామకాలు చేపట్టడం వంటి డిమాండ్ల విషయంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA), కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

error: Content is protected !!