News April 12, 2025
నంద్యాల జిల్లా టుడే TOP NEWS.!

☞దొర్నిపాడులో అత్యధికంగా 40.9⁰C ఉష్ణోగ్రత ☞గృహా నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్
☞ఇంటర్ ఫలితాల భయంతో విద్యార్థి ఆత్మహత్య
☞రూ.12.37 కోట్లతో కార్పొరేషన్ రుణాల చెక్కుల పంపిణీ: మంత్రి ఫరూక్
☞బనగానపల్లెలో పర్యటించిన మంత్రి బీసీ
☞పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ
☞కొత్తగా పెళ్లి చేసుకునే వారికి బీసీ రాజారెడ్డి కానుక
☞మహానందిలో అరటి రైతుల కుదేలు
☞ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.
Similar News
News November 5, 2025
‘వనజీవి రామయ్య’ సినిమా ప్రారంభోత్సవానికి ఎంపీకి ఆహ్వానం

పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి రావాలని ఎంపీ రఘురాం రెడ్డిని చిత్ర దర్శకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మొక్కలు నాటడానికి జీవితాన్ని అంకితం చేసిన రామయ్య చరిత్రను సినిమాగా రూపొందించడం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. ఈ చిత్రంలో నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
News November 5, 2025
VKB: బస్సు ప్రమాద బాధిత కుటుంబానికి స్పీకర్ సాయం

చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన ధన్నారం తండాకు(శ్రీరాంనగర్ తండా) చెందిన తారాబాయి కుటుంబానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.7 లక్షల పరిహారంతో పాటు, తనవంతుగా రూ.1 లక్షను స్పీకర్ అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండటం మన బాధ్యత అని స్పీకర్ అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
News November 5, 2025
మార్చి 31 నాటికి అన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో పీఎం జన్మన్ కింద మార్చి 31వ తేదీ నాటికి లబ్ధిదారుల అన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని హౌసింగ్ పీడీని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 556 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, ఇప్పటివరకు 18 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయన్నారు. గ్రౌండింగ్లో ఉన్న 281 ఇళ్లు, ఇంకా ప్రారంభించని 257 ఇళ్లను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు.


