News February 21, 2025

నంద్యాల జిల్లా TODAY TOP న్యూస్ 

image

☞శ్రీశైలం పాతాళ గంగ వద్ద భక్తుల సందడి. ☞ పీఎం కిసాన్ ద్వారా జిల్లాలో 4.5 లక్షల మందికి లబ్ధి. ☞రీ సర్వే గ్రామం(ఎస్.కొత్తపల్లె)ను సందర్శించిన కలెక్టర్. ☞జగన్‌కు Z+ కేటగిరి భద్రత కల్పించాలి: SV మోహన్ రెడ్డి. ☞ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గృహానికి విచ్చేసిన కలెక్టర్. ☞మంగళగిరిలో వినతులు స్వీకరించిన మంత్రి బీసీ. ☞CM అన్న భ్రమలోనే జగన్ ఉన్నాడు: మంత్రి ఫరూక్. ☞డోన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 

Similar News

News December 26, 2025

SRKLM: ప్రమాదాల కట్టడికి ఎస్పీ మాస్టర్ ప్లాన్!

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ‘బ్లాక్ స్పాట్స్’ వద్ద రక్షణ చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. మలుపుల వద్ద సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు.

News December 26, 2025

రేపు రూ.97 కోట్లతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ బడ్జెట్

image

2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.97 కోట్ల అంచనాతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ బడ్జెట్ రూపొందించారు. ఆరంభనిల్వ రూ.7.37 కోట్లుగా చూపారు. జమలు రూ.90.89 కోట్లు, ఖర్చు రూ.97.04 కోట్లుగా బడ్జెట్ రూపొందించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జమలు రూ.66.50 కోట్లు, ఖర్చులు రూ.63.55 కోట్లుగా చూపారు. నిల్వ రూ.7.37 కోట్లుగా చూపారు. శనివారం బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చైర్ పర్సన్ లక్ష్మీదేవి తెలిపారు.

News December 26, 2025

ఇరగవరం: అమరజీవి జలధారకు శంకుస్థాపన

image

శుద్ధిచేసిన తాగునీటిని ఇంటింటికీ అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం ఇరగవరం మండలం కత్తవపాడులో ఇంటింటికి తాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా అమరజీవి జలధార కార్యక్రమానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి మొదటి దశలో తణుకు నియోజకవర్గం ఎంపిక చేయడం అభినందనీయమన్నారు.