News February 12, 2025

నంద్యాల: టెన్త్ అర్హతతో 37 ఉద్యోగాలు

image

నంద్యాల జిల్లా (డివిజన్)లో 37 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు https://indiapostgdsonline.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News September 18, 2025

పెళ్లి పేరుతో మోసం చేసిన ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదు: SI

image

సంతకవిటి పోలీస్ స్టేషన్‌లో గురువారం ఓ ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదైంది. SI గోపాలరావు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ ఆర్మీ ఉద్యోగి కొన్నేళ్లుగా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత ముఖం చాటేశాడని, దీంతో ఆర్మీ ఉద్యోగిపై సదరు యువతి గురువారం సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI పేర్కొన్నారు.

News September 18, 2025

కొండాపూర్: గులాబీ మొక్కకు పూసిన విద్యుత్ దీపాలు

image

కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఒక అద్భుత దృశ్యం కెమెరాకు చిక్కింది. ఒక గులాబీ మొక్కకు పువ్వులకు బదులుగా నక్షత్రాలు వికసించినట్లుగా ఆ చిత్రం ఉంది. గులాబీ మొక్కకు దూరంలో ఉన్న రెండు ఇళ్ల విద్యుత్ దీపాలు కెమెరాకు ఇలా కనిపించాయి. ఈ చిత్రాన్ని చూసి చాలా మంది వీద్యుత్ దీపాలు గులాబీ మొక్కకు వికసించినట్లు ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

News September 18, 2025

VJA: దుర్గగుడి ఛైర్మన్ నియామకంపై తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి

image

దుర్గగుడి ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్‌గా బాలకృష్ణ అభిమాని బొర్రా గాంధీని నియమించడంపై స్థానిక TDP నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. YCP పాలనలో కేసులను ఎదుర్కొని, పార్టీ కోసం కష్టపడిన కీలక నేతలకు పదవి దక్కుతుందని ఆశించారు. అయితే, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా లేని గాంధీకి బాలకృష్ణ సిఫార్సుతోనే పదవి లభించిందని జిల్లా TDP నేతలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.