News September 22, 2025
నంద్యాల: పీజీఆర్ఎస్కు 220 దరఖాస్తులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలించి సంతృప్త స్థాయిలో వేగవంతంగా, నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి 220 అర్జీలు స్వీకరించారు. అధికారులు అర్జీలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News September 22, 2025
సంగారెడ్డిలో ప్రజావాణికి 33 ఫిర్యాదులు

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాధురి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మొత్తం 33 మంది తమ సమస్యలను విన్నవించారు. ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ప్రజలకు కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News September 22, 2025
ANU: దూరవిద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య 2025-26 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాలను వర్సిటీ VC గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ లు సోమవారం విడుదల చేశారు. ఎంబీఏ 600 మందికి 435మంది, ఎంసీఏ 128 మందికి 80మంది అర్హత సాధించారన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ www.anucde.info. నుండి ఫలితాలు పొందవచ్చు అన్నారు.
News September 22, 2025
ఎన్టీఆర్: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో UG 3వ సెమిస్టర్ రెగ్యులర్, 5వ సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు అక్టోబర్ 30, నవంబర్ 7 నుంచి నిర్వహిస్తామని..పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 25లోపు, రూ.100 ఫైన్తో అక్టోబర్ 4లోపు ఫీజు చెల్లించాలని ANU పరీక్షల విభాగం సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని సూచించింది.