News December 16, 2025
నంద్యాల: ‘ఫైనాన్స్ సంస్థ బెదిరింపుల నుంచి కాపాడాలి’

తమకు ఎలాంటి లోన్లు లేకపోయినా ఫైనాన్స్ సంస్థవారు తప్పుడు సమాచారాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్కు పెద్ద దేవలాపురంకి చెందిన రామారావు ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 107 ఫిర్యాదులు అందినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. పిన్నాపురంకి చెందిన వెంకటరాజు, అబ్దుల్లాపురం రత్నమ్మలు తన భూమిని ఇప్పించాలని కోరారు.
Similar News
News December 22, 2025
VKB: ప్రజావాణికి వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం

ప్రజావాణికి వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం చూపి ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తున్నామని కలెక్టర్ ప్రతీక్జైన్ తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News December 22, 2025
వరంగల్: మాజీ ACP, CI, SI సస్పెండ్

గతంలో వరంగల్ ఏసీపీగా విధులు నిర్వహించిన నందిరాం నాయక్తో పాటు ప్రస్తుతం సీసీఎస్ CI గోపి, ఎస్ఐ విఠల్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసే సమయంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేసినట్లుగా ఫిర్యాదులందడంతో, దీనిపై విచారణ జరిపి అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశారు.
News December 22, 2025
జగిత్యాల: డూప్లికేట్, బ్లర్ ఎంట్రీల సవరణపై దృష్టి

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తహశీల్దార్లను ఆదేశించారు. డూప్లికేట్ ఎంట్రీలు, సమాన వివరాలు, బ్లర్ ఫోటోలు సరిదిద్దాలని సూచించారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి క్షేత్రస్థాయిలో నమోదు చేయాలని, బూత్ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఓటరు జాబితా రూపొందించాలని తెలిపారు.


