News April 13, 2025
నంద్యాల: బాదంపప్పుపై ఆంజనేయ స్వామి చిత్రం

నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ హనుమాన్ జయంతి సందర్భంగా.. బాదంపప్పుపై ఆంజనేయస్వామి చిత్రాన్ని చిత్రీకరించాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాదంపప్పుపై హనుమంతుడు చిత్రాన్ని చిత్రీకరించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని మోసుకు వస్తున్న రూపంలో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, వారి ప్రతిభను ప్రముఖులు ప్రత్యేకంగా కొనియాడారు.
Similar News
News April 14, 2025
ICC మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్గా మరోసారి గంగూలీ

టీమ్ఇండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ మరోసారి ICC మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్గా నియమితులైనట్లు ICC వెల్లడించింది. ఈ కమిటీలో VVS లక్ష్మణ్ తిరిగి ప్యానెల్ మెంబర్గా చేరారు. వీరితో పాటు హమీద్ హసన్(AFG), డెస్మండ్ హేన్స్(WI), టెంబా బావుమా(SA), జోనాథన్ ట్రాట్(ENG) కమిటీలో ఉన్నారు. గంగూలీ మూడేళ్లు ఈ పదవిలో కొనసాగనున్నారు. దాదా తొలిసారి 2021లో క్రికెట్ కమిటీ ఛైర్మన్గా నియామకమైన విషయం తెలిసిందే.
News April 14, 2025
బెల్లంపల్లిలో మహిళ అరెస్ట్

బెల్లంపల్లిలోని రైల్వే స్టేషన్ ముందు అక్రమంగా దేశీదారు విక్రయిస్తున్న మహిళను ఆదివారం అరెస్ట్ చేసినట్లు 2 టౌన్ ఎస్ఐ మహేందర్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు రైల్వే స్టేషన్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా కోట సారమ్మ వద్ద 9 లీటర్ల దేశీదారు మద్యం లభ్యమైందని పేర్కొన్నారు. మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఆమెపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
News April 14, 2025
సమ్మర్లో కీరదోసతో ఎన్నో లాభాలు!

* కీరదోసలోని 96% నీటి వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు.
* అంతర్గత వాపు, కండరాల నొప్పిని తగ్గిస్తుంది.
* పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
* చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది.
* నోటి దుర్వాసన తగ్గడంతో పాటు శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది.
* బరువు తగ్గాలనుకునే వారికి కీరదోస మంచి ఆయుధం.
* కీరలోని డైయూరిటిక్ గుణాలు మూత్రం ద్వారా టాక్సిన్స్ బయటకు పంపుతాయి.