News April 6, 2025
నంద్యాల: మెగా జాబ్ మేళా

నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 10న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.శ్రీకాంత్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఆపై చదివిన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులన్నారు. ఈ మేళాలో 14 కంపెనీల ప్రతినిధులు పాల్కొంటారని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 7, 2025
జగన్ పర్యటనను అడ్డుకుంటాం: MRPS

మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గ పర్యటనను అడ్డుకుంటామని MRPS క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ బీసీఆర్ దాస్ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన తర్వాతే జిల్లా పర్యటనకు రావాలని స్పష్టం చేశారు. మండలిలో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. తమ నేతలతో కలిసి జగన్ పాపిరెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన విడుదల చేశారు.
News April 7, 2025
ఇన్స్టాగ్రామ్లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి!

ఆదోని మండల పరిధిలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన యువతికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి శ్రీరామనవమి రోజున ఒక్కటయ్యారు. నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని కుటుంబ సభ్యులు వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
News April 7, 2025
KKD: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న బుకీ అరెస్ట్

ఐపీఎల్ సీజన్ ప్రారంభమవడంతో హనుమకొండ పోలీసులు బెట్టింగ్ రాయుళ్లను ఆదివారం అరెస్ట్ చేశారు. ఏజెంట్లకు మధ్యవర్తిగా వ్యహరిస్తున్న కాకినాడకు చెందిన క్రికెట్ బుకీ వీరమణికూమార్ను అదుపులోకి తీసుకున్నారు. గోవాలోని యోగేశ్ గుప్తా బెట్టింగ్ లాభాల్లో 9% ఇస్తానని చెప్పడంతో పలువురితో బెట్టింగులు కట్టించాడు. కాకినాడలో ఓ ప్లాటు, రెండు మద్యం దుకాణాలు దక్కించుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.