News April 6, 2024
నంద్యాల: రూ.5.2 లక్షల నగదు స్వాధీనం
మహానంది మండల పరిధిలోని గాజులపల్లి చెక్పోస్టు వద్ద రికార్డులు లేకుండా తీసుకువెళ్తున్న నగదు స్వాధీనం పరుచుకున్నట్లు ఎస్సై నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్లు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో రూ.2.14 లక్షలు, మరో వాహనంలో రూ.2.88 లక్షలు స్వాధీనం చేసుకుని ట్రెజరీలో అప్పగించినట్లు తెలిపారు. బర్రెల వ్యాపారులు ఈ నగదు తీసుకువెళ్తున్నట్లు సమాచారం.
Similar News
News February 5, 2025
కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి: కలెక్టర్
ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రోజూ లక్ష మందికి ఉపాధి పనులు కల్పించాలని ఏపీడీ, ఎంపీడీవో, ఏపీవోలను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు.ఉపాధి హామీ పనుల పురోగతి అంశంపై ఏపీడీలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. పనుల కల్పనలో వెనుకబడిన అధికారులతో మాట్లాడారు. కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలన్నారు.
News February 5, 2025
పారా అథ్లెటిక్స్లో ఎమ్మిగనూరు డిగ్రీ విద్యార్థి ఘనత
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈనెల 2న జరిగిన 7వ రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్లో ఎమ్మిగనూరు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి పింజారి బషీర్ సత్తా చాటాడు. 100 మీటర్లు, 1,500 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించాడు. ఈ విజయంతో కళాశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చిందని కళాశాల అధ్యక్షుడు డా.మహబూబ్ బాషా పేర్కొన్నారు. బషీర్ను కళాశాల అధ్యాపక సిబ్బంది అభినందించారు.
News February 5, 2025
అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే పార్థసారథి వినతి
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మంగళవారం కలిసి రైల్వే గేట్ నంబర్ 197 వద్ద రోడ్డు, అండర్ బ్రిడ్జ్ (RUB) నిర్మాణంపై విన్నవించారు. పట్టణంలో ఈ గేటు మూసివేయడంతో మార్కెట్ యార్డ్కు వెళ్లాల్సిన రైతులు, కార్మికులు, పాదచారులు అదనంగా 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తొలగించేలా బ్రిడ్జి నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని కోరారు.