News December 28, 2025
నంద్యాల: విషాదం.. ఇద్దరు పిల్లల్ని తోసేసి తల్లి సూసైడ్

నంద్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. SRBC కాలువలో పిల్లలను తోసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గడివేముల మండలం మంచాలకట్ట సమీపంలోని కాలువ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. మృతులు ఒండుట్లకు చెందిన లక్ష్మీదేవి, వైష్ణవి(4), సంగీత(5 నెలలు)గా తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News December 29, 2025
ESIC హాస్పిటల్ కలబురగిలో ఉద్యోగాలు

<
News December 29, 2025
GWL: వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి

నూతన సంవత్సర 2026 వేడుకలు శాంతియుతంగా సురక్షితంగా జరుపుకోవాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సర వేళ శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని పలు నిబంధనలు విధించామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగంగా మద్యం సేవించడం, ర్యాలీ, డీజీలు వినియోగించడం నిషేధించామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News December 29, 2025
WGL: రాంకీ ఇన్ ఫ్రాలో 102 ఎల్ఐజీ ఫ్లాట్లు

వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో అల్పాదాయ వర్గాల కోసం ఎల్ఐజీ 102 ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చినట్లు హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజినీర్ సి.వి.రమణారెడ్డి, కార్యదర్శి ఎస్.విమల తెలిపారు. కొనుగోలు ఆసక్తి ఉన్న వారు జనవరి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫ్లాట్లను 8న లాటరీ విధానంలో కేటాయిస్తామని అన్నారు. ఈ ఫ్లాట్ల గూర్చి రాంకీ ప్రాజెక్టు సైట్ వద్ద మంగళవారం అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారని అన్నారు.


