News October 3, 2024

నంద్యాల హత్య కేసులో ముద్దాయి అరెస్టు

image

నంద్యాల గుడిపాటిగడ్డ వీధిలో గత నెల 30న దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సాయి మనోహర్‌ను హత్య చేసిన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. తన భార్యతో అక్రమ సంబంధం ఉందని మనోహర్‌తో దుర్గా ప్రసాద్ గొడవ పెట్టుకొని కత్తితో దాడి చేశాడన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మరణించాడన్నారు. పరారీలో ఉన్న దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.

Similar News

News October 3, 2024

జాతీయ స్థాయి పోటీలకు కర్నూలు విద్యార్థి

image

కరాటేలో కర్నూలు జిల్లా యువకుడు బద్రీనాథ్ రెడ్డి సత్తా చాటుతున్నారు. కర్నూలు టౌన్ మోడల్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి బద్రీనాథ్ రెడ్డి అండర్-19 విభాగంలో ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ సుంకన్న వెల్లడించారు. ఇటీవల రాజంపేటలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో తన ప్రతిభతో ఆకట్టుకున్నారని తెలిపారు. విద్యార్థిని కళాశాల సిబ్బంది, తల్లిదండ్రులు అభినందించారు.

News October 3, 2024

రెండో రోజు కొనసాగిన విశాఖ ఉక్కు రక్షణ రిలే దీక్షలు

image

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర కార్మిక సంఘాలు, వామపక్ష, ప్రజా సంఘాలు, రైతు సంఘాల రాష్ట్ర సమితి పిలుపు మేరకు కర్నూలు ధర్నా చౌక్‌లో రెండో రోజు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏఐయూటీసీ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజయ్ బాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ మాట్లాడారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

News October 3, 2024

కర్నూలు: CM హామీ.. రూ.లక్ష చెక్కు అందజేసిన కలెక్టర్

image

పత్తికొండ మండల పరిధిలోని పుచ్చకాయలమడ పర్యటన సందర్భంగా మంగళవారం CM చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కవిత భర్త రాముడు వైద్య చికిత్స నిమిత్తం CM రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష చెక్కును బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పీ.రంజిత్ బాషా, పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ బాబు అందజేశారు. కవిత కుటుంబ సభ్యులు CM చంద్రబాబు, కలెక్టర్‌ రంజిత్ బాషా, MLA శ్యామ్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.