News November 6, 2024

నంద్యాల IIIT విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

నంద్యాలకు చెందిన ఓ యువతి శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విద్యాలయం (ట్రిపుల్ ఐటీ)లో ఆత్మహత్యాయత్నం చేసింది. విష ద్రావణం తాగిన విద్యార్థిని వసతి గృహం సిబ్బంది గుర్తించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ యువతి ప్రస్తుతం ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ మొదటి ఏడాది చదువుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 2, 2026

శ్రీశైలంలో నేడు శివరాత్రి బ్రహ్మోత్సవాలపై సమీక్ష

image

శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు సమీక్ష సమావేశం జరగనుంది. దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్‌ వద్ద జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగనుంది. సమీక్షలో పలువురు మంత్రులతోపాటు నంద్యాల, కర్నూలు, ఉమ్మడి ప్రకాశం, నాగర్ కర్నూలు జిల్లాల శాఖల అధికారులు పాల్గొననున్నారు.

News February 2, 2026

కర్నూల్: 46 ఏళ్లకు ఒక్కటయ్యారు

image

1979-80 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు 46 ఏళ్ల తర్వాత కర్నూలులో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకొని సంతోషం వ్యక్తం చేశారు. మృతిచెందిన 15 మంది మిత్రులకు నివాళులు అర్పించారు. విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు. ఉమ్మరాజు, చిన్న ఓబులేశు గౌడు రచించిన ‘శ్రీ శిర్డీ సాయి స్తోత్ర శతకం’ గ్రంథాన్ని ఆవిష్కరించారు.

News February 2, 2026

కర్నూలు: ‘30 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు’

image

వెల్దుర్తి మండలం కలగొట్ల జడ్పీహెచ్ పాఠశాలలో 1995-96లో చదివిన పదో తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న విద్యార్థులు పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కల్లూరు ఎంఈవో శ్రీనివాసులు, విశ్రాంత ఉపాధ్యాయులు మునీశ్వరరావు, మహేశ్వర్ రెడ్డి పాల్గొని సూచనలు చేశారు.