News October 15, 2024
నకిరేకల్-నాగార్జున సాగర్ హైవేకు నిధుల విడుదల
నల్గొండ జిల్లా అభివృద్ధిపై కేంద్రం ఫోకస్ చేసింది. నకిరేకల్-నాగార్జున సాగర్ మధ్య హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 14 కి.మీ. మేర 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.516 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. గుంటూరు-నల్లపాడు మధ్య రూ.98 కోట్లతో 4 లైన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News October 15, 2024
17న నల్గొండలో సీఎం కప్ ర్యాలీ
ఈనెల 17న సీఎం కప్ -2024 పేరుతో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం క్రీడలు నిర్వహిస్తోందని జిల్లా యువజన, క్రీడల అధికారి విష్ణుమూర్తిగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులకు దీనిపై అవగాహన కల్పించేందుకు 17న నల్గొండలో మర్రిగూడ బైపాస్ రోడ్ నుంచి పెద్ద గడియారం సెంటర్ వరకు సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
News October 15, 2024
NLG: మూసీకి తగ్గిన వరద.. గేట్లు మూసివేత
మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు తగ్గుముఖం పట్టడంతో సోమవారం ప్రాజెక్టు అధికారులు దిగువకు నీటి విడుదల పూర్తిగా నిలిపివేశారు. HYD నగరంతోపాటు, మూసీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసీ ప్రాజెక్టుకు సోమవారం కేవలం 994 క్యూసెక్కుల వరదనీరు వచ్చింది. 645 అడుగుల గరిష్ఠ నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో సాయంత్రం వరకు నీటిమట్టం 644.50 అడుగులు ఉంది.
News October 15, 2024
NLG: నేడు కొత్త టీచర్లకు పోస్టింగ్..!
డీఎస్సీ 2024 ఫలితాల్లో ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు మంగళవారం పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఇప్పటికే వారు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ జిరాక్స్, జాయినింగ్ లెటర్ సమర్పించారు. 535 మంది నూతన ఉపాధ్యాయులు మెరిట్ (ర్యాంకుల) ఆధారంగా ఖాళీల పోస్టులను ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. అనంతరం మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించి తాము ఎంపిక చేసుకున్న పాఠశాలకు పోస్టింగ్ ఇస్తారు.