News December 31, 2025

నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్‌కి రిమాండ్

image

ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో నిందితులకు కోర్టు రిమాండ్‌ గడువు పొడిగించింది. ఈ కేసులో బుధవారం విజయవాడ కోర్టులో విచారణ చేపట్టారు. దీంతో మాజీ మంత్రి జోగి రమేశ్, జోగి రాముతో సహా మిగిలిన నిందితులకు జనవరి 12వ తేదీ వరకు రిమాండ్‌ పడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఉన్నతాధికారులు నిందితులను తిరిగి జిల్లా జైలుకు తరలించారు.

Similar News

News January 11, 2026

నల్గొండ ‘కార్పొరేషన్’.. గెజిట్‌ కోసం నిరీక్షణ!

image

నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లు గవర్నర్ వద్ద ఉంది. దీనిపై గెజిట్ విడుదల కావాల్సి ఉండటంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేసినప్పటికీ, తుది జాబితా ప్రదర్శనను ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆదేశాలు అందినట్లు సమాచారం. గెజిట్ వెలువడితేనే 48 వార్డుల పునర్విభజన, మేయర్ పదవి రిజర్వేషన్లపై స్పష్టత రానుంది.

News January 11, 2026

భీమవరంలో రౌడీయిజం.. మద్యం మత్తులో దాడి!

image

భీమవరం రైతు బజార్ సమీపంలోని వైన్ షాప్ వద్ద మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఒకరిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదుతో వన్ టౌన్ ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు హెచ్చరించారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

News January 11, 2026

మేడారం జాతరలో 3,199 మందితో వైద్య సేవలు

image

ఈ నెల 28 నుంచి మొదలయ్యే మేడారం శ్రీ సమ్మక్క, సారమ్మ జాతరలో భక్తులకు వైద్య సేవలు అందించడానికి 3,199 మంది వైద్య సిబ్బంది వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి 72 మంది స్పెషలిస్టులు, 42 మంది స్త్రీ వైద్య నిపుణులతో కలిపి 544 మంది వైద్యులు విధుల్లో ఉంటారు. మరో 2,150 మంది పారా మెడికల్ సిబ్బంది షిప్ట్‌ల వారీగా 24 గంటల పాటు సేవలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.