News April 18, 2025

నక్కపల్లి: బైక్ నుంచి జారిపడి మహిళ మృతి

image

నక్కపల్లి మండలం కాగిత సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. మునగపాక మండలం ఒంపోలుకు చెందిన దిమిలి వెంకటలక్ష్మి తన కుమారుడితో కలిసి కాకినాడ జిల్లా కత్తిపూడి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో కాగిత సమీపంలో తన కుమారుడు వేగంగా బైక్ నడపడంతో అదుపుతప్పి వెనక కూర్చున్న వెంకటలక్ష్మి జారి కింద పడింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News April 19, 2025

RCBకి చిన్నస్వామి స్టేడియమే శాపమా?

image

18 ఏళ్లుగా IPL టైటిల్ కొట్టాలనే RCB కలలపై సొంత గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం నీళ్లు చల్లుతోంది. బయటి మైదానాల్లో గెలుస్తున్న RCB ఇక్కడ మాత్రం చేతులెత్తేస్తోంది. ఈ స్టేడియం చిన్నగా ఉండటం సొంత జట్టుకన్నా ప్రత్యర్థులకే ఎక్కువగా ఉపయోగపడుతోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత WPL, IPLలో కలిపి ఇక్కడ 7 మ్యాచులు వరుసగా ఓడడంతో ఈ మైదానం RCBకి అచ్చిరావడం లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు.

News April 19, 2025

కడపలో పోలీసుల శ్రమదానం

image

నిత్యం విధి నిర్వహణలో బిజీగా గడిపే పోలీసులు చీపుర చేతబట్టి చెత్త  ఊడ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కడప ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో చెత్తాచెదారం తొలగించారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.

News April 19, 2025

మన ఓరుగల్లు జిల్లా.. ఎన్నో ప్రత్యేకతలు

image

మన ఓరుగల్లు పేరు చెప్పగానే కాకతీయులు గుర్తుకొస్తూ ఉంటారు. ఓరుగల్లును రాజధానిగా చేసుకొని కాకతీయులు తమ పరిపాలనను కొనసాగించారు. తమ కాలంలో వారు ఏర్పాటు చేసిన గొలుసుకట్టు చెరువులు, వారు నిర్మించిన రామప్ప, వేయి స్తంభాల ఆలయం, కోట, కాకతీయ కళా తోరణం, కోటగుళ్లు, ఇతర శివాలయాలు నేటికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

error: Content is protected !!