News January 23, 2026
నగరిలో CM కాన్వాయ్ ట్రయల్ రన్

నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో కాన్వాయ్ ట్రయల్ రన్ శుక్రవారం నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి ట్రయల్ రన్ ప్రారంభమైంది. కీలక పాయింట్లు, ట్రాఫిక్ డైవర్షన్లు, సేఫ్టీ జోన్లపై సిబ్బందికి స్పష్టత ఇచ్చారు. వాహనాల మధ్య తగిన గ్యాప్ ఉండేలా పరిమిత వేగంతో, క్రమశిక్షణతో ప్రయాణించాలని ఆదేశించారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
Similar News
News February 8, 2026
చిత్తూరు జిల్లాలో కోడి ధర KG రూ.140

చికెన్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆదివారం ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.132-రూ.140 లవరకు ఉంది. మాంసం రూ.191-రూ.216 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.218 నుంచి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ.75 గా ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News February 8, 2026
చిత్తూరు: టెన్త్ విద్యార్థులకు మరో ఛాన్స్

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్ లో తప్పిదాల సవరణకు అవకాశం కల్పించారని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. విద్యార్థుల నామినల్ రోల్స్లో ఆన్ లైన్లో సవరణలు చేసుకునేందుకు హెచ్ఎం లాగిన్లో అవకాశం కల్పించారన్నారు. దీన్ని ఆయా హెచ్ఎంలు సద్వినియోగం చేసుకుని, ఈనెల 12వ తేదీ లోపు తప్పిదాలు ఉన్నట్లయితే సరి చేసుకోవాలన్నారు.
News February 7, 2026
కుప్పంలో వరుసగా అమ్మాయిల మిస్సింగ్

కుప్పం నియోజకవర్గ పరిధిలో వారం రోజుల్లో ఐదుగురు యువతుల మిస్సింగ్ ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ వ్యవహారమో లేక కుటుంబ కారణాల నేపథ్యమో తెలియదు గానీ మైనర్ బాలికలతో పాటు 22 ఏళ్లలోపు యువతులు అదృశ్యమవుతున్నారు. వారం రోజుల్లో రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, రాళ్ల బూదుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్క మిస్సింగ్ కేసు నమోదయింది.


