News December 29, 2025
నటి మాధవీలతపై కేసు నమోదు

నటి మాధవీలతపై HYDలోని సరూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. SMలో సాయిబాబాపై అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్లపైనా కేసు పెట్టారు. వీరి పోస్టులు ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశాయని ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని ఆదేశించారు. అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Similar News
News December 31, 2025
ఎంత తాగితే డ్రంకన్ డ్రైవ్లో దొరకరు?

మందుబాబులు తలబాదుకునే ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. ఒక బీరే కదా.. ఒక పెగ్గుకు ఏం కాదులే అనుకుంటే పొరపాటే. విస్కీ, బ్రాందీ, బీర్, వైన్ ఇలా.. ఏ రకమైనా గ్లాసు తాగినా టెస్టులో పాజిటివ్ (35పాయింట్స్) వస్తుంది. మందుతో పాటు మనుషుల శరీరాన్ని బట్టి, రక్తంలో ఆల్కహాల్ కలిసే సమయం ఆధారంగా ఈ రిజల్ట్ మారుతుంది. కాబట్టి మద్యం తాగడం, తాగకపోవడం మీ ఇష్టం. కానీ ఒక్క చుక్క బాడీలోకి వెళ్లినా బండి తీయకండి.
News December 31, 2025
2025: భారత వనితల జైత్రయాత్ర!

ఈ ఏడాది భారత మహిళలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారు. రచయిత్రి బానూ ముస్తాక్ బుకర్ ప్రైజ్ సాధించగా, రచయిత్రి పాయల్ కపాడియా కేన్స్లో మెరిశారు. సామాజిక సేవలో వర్ష దేశ్పాండే(UN అవార్డు), పర్యావరణంలో డా.సొనాలి ఘోష్, జయశ్రీ వెంకటేశన్ అవార్డులు అందుకున్నారు. మహిళల అంధుల జట్టు T20 WC, ఉమెన్స్ టీమ్ ODI WC నెగ్గింది. ఇంజినీర్ మాధవిలత ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెన నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.
News December 31, 2025
యూరియాపై అనవసర ఆందోళనలు: మంత్రి

TG: అన్ని జిల్లాల్లో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నా అనవసర <<18720117>>ఆందోళనలు<<>> సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రస్తుతం సుమారు 2L మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని, సొసైటీ/రిటైల్ షాప్కు వచ్చే ప్రతి రైతుకూ బస్తాలు అందుతున్నాయని చెప్పారు. యూరియా యాప్ అమలవుతున్న జిల్లాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేవని, యాప్ ద్వారా దాదాపు లక్ష మంది 3.19L బస్తాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.


