News December 4, 2024

నడిగూడెం: బంతి తోట.. లాభాల పంట

image

బంతి తోట సాగుతో మంచి లాభాలు వచ్చాయని బంతితోట సాగు రైతు మేకపోతుల వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. మండలంలోని బృందావనపురం గ్రామానికి చెందిన రైతు నడిగూడెం నుంచి రామచంద్రపురం వెళ్లే ప్రధాన రహదారి పక్కన తనకున్న వ్యవసాయ భూమిలో కొంత 0.50 సెంట్లలో బంతితోట సాగు చేశారు.కింటాకు రూ.5,000 – 6000 ధర పలుకుతుందని తెలిపారు. బంతి తోట సాగు చేయాలని నిర్ణయించుకొని వరికి బదులుగా బంతితోట సాగు చేయటంతో లాభసాటిగా ఉందన్నారు.

Similar News

News February 21, 2026

సాగర తీరానికి జలకళ.. పర్యాటకులకు ప్రకృతి విందు!

image

ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ జలాశయం క్రమంగా జలకళను సంతరించుకుంటోంది. ఎగువన ఉన్న శ్రీశైలం నుండి విద్యుదుత్పత్తి ద్వారా వస్తున్న వరదతో వారం రోజులుగా సాగర్ నీటిమట్టం పెరుగుతూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. గడిచిన వారం రోజుల్లోనే ప్రాజెక్టు నీటిమట్టం 5 అడుగులు పెరిగి ప్రస్తుతం 541 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి ప్రస్తుతం 56,315 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

News February 21, 2026

నల్లగొండ: బతుకుతెరువుకు వంద మార్గాలు..!

image

పనిచేయాలనే తపన ఉండాలే కానీ.. బతుకుతెరువుకు వంద మార్గాలు ఉన్నాయని నల్లగొండ యువత నిరూపిస్తోంది. స్థానికంగా ఓ మార్ట్ వద్ద డెలివరీ బాయ్స్‌గా చేరేందుకు యువత క్యూ కడుతున్నారు. ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలే దీనికి ప్రధాన కారణం. డెలివరీ పాయింట్ దూరాన్ని బట్టి చెల్లింపులు ఉన్నాయి. 1.3 కిలోమీటర్ల లోపు ప్రతి డెలివరీకి రూ.35, ఆ పైన దూరం ఉంటే రూ.45 చొప్పున సంస్థ అందిస్తోంది.

News February 21, 2026

మునుగోడు: యజమాని మృతి.. శ్మశానం వద్దే వేచిచూస్తున్న కుక్క!

image

మునుగోడు మండలం కిష్టాపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన మనుషుల మధ్య బంధాలకంటే మూగజీవాల విశ్వాసం గొప్పదని మరోసారి నిరూపించింది. తనను ప్రాణప్రదంగా చూసుకున్న యజమాని పార్వతమ్మ మరణాన్ని ఆ కుక్క తట్టుకోలేకపోయింది. అంత్యక్రియలు ముగిసినా, మండుటెండలో శ్మశానం వద్దే ఉండిపోవడం ఆ మూగజీవికి ఉన్న అనురాగానికి నిదర్శనం. ఈ హృదయ విదారక దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.