News May 20, 2024

నరసన్నపేటలో మేకల దొంగలు

image

నరసన్నపేట మండలం చోడవరం ఎస్సీ కాలనీకి చెందిన బక్క నీలం పెంచుకుంటున్న 30 మేకలను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. పశువుల శాలలో కట్టిన 55 మేకల్లో 30 మూగజీవాలను ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం నరసన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. మేకల విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 25, 2025

శ్రీకాకుళం గడ్డపై వాజ్‌పేయి ఎన్నికల ప్రచారం.. జ్ఞాపకాల నెమరువేత

image

1983 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అటల్ బిహారీ వాజ్‌పేయి శ్రీకాకుళంలో పర్యటించిన అరుదైన జ్ఞాపకాలను జిల్లా బీజేపీ గుర్తు చేసుకుంది. అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గ అభ్యర్థి సంపతిరావు రాఘవరావు తరఫున ఆయన ప్రచారం చేశారు. కుష్బూ థాక్రేతో కలిసి జడ్పీ గెస్ట్ హౌస్‌లో బస చేసిన ఆయన ప్రసంగం ఆనాడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఆ ఎన్నికల్లో రాఘవరావు 14శాతం ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచారు.

News December 25, 2025

SKLM: రథసప్తమిపై ప్రజాభిప్రాయ సేకరణ రద్దు

image

రథసప్తమిపై ప్రజల అభిప్రాయ, సలహాల స్వీకరణ కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న శ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వలన రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ ఈ విషయం గమనించాలి కోరారు.

News December 25, 2025

శ్రీకాకుళం: 9 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికూతురు

image

ఇచ్ఛాపురంలో ఒక నిత్య పెళ్లికూతురు ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో ఓ యువతి మరో మహిళ సహాయంతో వరుసగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. ఇటీవల వివాహం అనంతరం అనుమానం రావడంతో బాధితుడు ఇచ్ఛాపురం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిత్యపెళ్లికూతురుతో పాటు మరో మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం.బరంపురానికి చెందిన ఒక యువకుడిని పెళ్లిచేసుకుని మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు.