News March 24, 2024

నరసన్నపేటలో 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయా..?

image

నరసన్నపేట నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటివరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే అత్యధికంగా 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్ , TDP అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై 19,025 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం 2024 ఎన్నికల బరిలో కూడా YCP, TDP నుంచి వీరే ప్రత్యర్థులుగా ఉన్నారు. మరి ఈసారైనా TDPని విజయం వరిస్తుందా..లేదా..2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ కానున్నాయా? కామెంట్ చేయండి.

Similar News

News September 7, 2025

సిక్కోలు నటుడికి SIIMA అవార్డు

image

ఆమదాలవలస(M) కొర్లకోటకి చెందిన నటుడు పేడాడ సందీప్ సూరజ్‌కి దుబాయ్‌లో జరిగిన SIIMA అవార్డ్స్‌లో బెస్ట్ డెబ్యూ హీరో అవార్డును శనివారం ప్రకటించారు. సూరజ్ హీరోగా నటించిన ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమాకి గాను అవార్డు లభించింది. దీంతో అతనికి అభిమానులు, గ్రామస్థులు అభినందనలు తెలియజేశారు. సందీప్ సరోజ్ తల్లి రమణకుమారి విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

News September 7, 2025

నేడు APPSC పరీక్షలు ఆధ్వర్యంలో FBO, ABO పరీక్షలు

image

ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(FBO), అసిస్టెంట బీట్ ఆఫీసర్(ABO), ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి పరీక్షలు ఆదివారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా సుమారు పది పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. పరీక్షలకు మొత్తం 5186 మంది హాజరవుతారు. రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి.

News September 7, 2025

శ్రీకాకుళం: పరీక్షా కేంద్రాల పరిశీలన

image

శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ జరగనున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షల ఏర్పాట్లను శనివారం ఏపీపీఎస్సీ సభ్యుడు ఎన్. సోనీ వుడ్ పరిశీలించారు. జిల్లాలోని ముఖ్యమైన మూడు కేంద్రాలతో పాటుగా ఆయా అభ్యర్థుల కోసం చేసిన ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.