News March 24, 2024
నరసన్నపేట: ఏకైక మహిళా MLA ఈవిడే

నరసన్నపేటలో పోటీ చేసిన, విజయం సాధించిన ఏకైక మహిళగా బి.సరోజమ్మ నిలిచారు. ఈవిడ 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థి సిమ్మ జగన్నాదంపై 2,454 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. కాగా ఇప్పటివరకు నరసన్నపేట నియోజకవర్గంలో జరిగిన 16 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక మహిళ ఈవిడే కావడం విశేషం.
Similar News
News February 25, 2026
శ్రీకాకుళం: 70 ఏళ్ల వయసులో పరీక్ష

డీఈవోగా, డిపెప్ (ప్రస్తుత సర్వశిక్షా అభియాన్) ఏపీసీగా సేవలందించి పదవీ విరమణ చేసిన బలివాడ మల్లేశ్వరరావు చదువుపై తన ఆసక్తిని మరొకసారి చాటుకున్నారు. వమరవల్లి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో సీనియర్ లెక్చరర్గా పనిచేసిన ఆయన సుమారు 70 ఏళ్ల వయసులోనూ ఎంఎస్ఐఎస్సీ సెమిస్టర్ పరీక్షలు రాశారు. ఇప్పటికే అనేక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు పూర్తి చేసిన ఆయన మంగళవారం బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో పరీక్ష రాశారు.
News February 25, 2026
శ్రీకాకుళం: అతి సార నియంత్రణకు జిల్లా అధికారులతో కమిటీ

శ్రీకాకుళంలో అతిసార నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు జిల్లా అధికారులతో కమిటీ ఏర్పడింది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్, ఏపీఎంఐపీ, మెప్మా పీడీలు, ఉద్యానవన శాఖ ఏడీ, పశుసంవర్ధక శాఖ జేడీలతో ప్రత్యేక బృందాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నియమించారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య పరిస్థితి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను వీరు పర్యవేక్షించనున్నారు.
News February 25, 2026
శ్రీకాకుళం: అతి సార నియంత్రణకు జిల్లా అధికారులతో కమిటీ

శ్రీకాకుళంలో అతిసార నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు జిల్లా అధికారులతో కమిటీ ఏర్పడింది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్, ఏపీఎంఐపీ, మెప్మా పీడీలు, ఉద్యానవన శాఖ ఏడీ, పశుసంవర్ధక శాఖ జేడీలతో ప్రత్యేక బృందాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నియమించారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య పరిస్థితి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను వీరు పర్యవేక్షించనున్నారు.


