News October 21, 2024
నరసన్నపేట: ‘నా నిర్ణయంతోనే బిడ్డ చనిపోయింది’

నరసన్నపేట సత్యవరం సర్కిల్ హైవే వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. పోలాకి(M) జిల్లేడువలసకు చెందిన <<14408762>>భవ్య(17)<<>>, ఆమె తండ్రి గౌరేష్, రామరావు(48) శ్రీకాకుళం సమీపంలోని పరదేశిపాలెంలో పెళ్లికి వెళ్లారు. భవ్యకు సోమవారం పరీక్ష ఉండటంతో గౌరేష్ అక్కడే ఉండిపోయి.. భవ్యను రామారావుతో బైకుపై పంపగా లారీ ఢీకొని ఇద్దరూ చనిపోయారు. తన నిర్ణయంతోనే బిడ్డ చనిపోయిందని గౌరేశ్ బోరున విలపించారు.
Similar News
News December 25, 2025
సిక్కోలు సిన్నోడు SUPER

ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే గగనం.. అలాంటిది శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలం, మజ్జిలిపేట గ్రామానికి చెందిన పైడి.సతీష్ ఎలాంటి కోచింగ్ లేకుండా ఒకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. UPSC లో గ్రూప్-B నర్సింగ్ ఆఫీసర్, AMIIS లో నర్సింగ్ ఆఫీసర్, తెలంగాణలో MHSRB, 51 ర్యాంకుతో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను సంపాదించాడు. సతీష్ కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
News December 25, 2025
శ్రీకాకుళం: భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ జరుపుకోవాలి: కలెక్టర్

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని క్రైస్తవులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
News December 25, 2025
శ్రీకాకుళం: భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ జరుపుకోవాలి: కలెక్టర్

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని క్రైస్తవులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.


