News April 15, 2024

నరసన్నపేట: పెయింటర్ అనుమానాస్పద మృతి

image

నరసన్నపేటలోని ఒక పెయింటర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నరసన్నపేట పట్టణంలో పెయింటర్‌గా పనిచేస్తున్న గండి సోమేశ్వరరావు కుటుంబ కలహాలు కారణంగా ఈనెల 11వ తేదీన విశాఖపట్నం వెళుతున్నట్లుగా కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఆదివారం సాయంత్రం అతని మృతదేహం కనిపించింది. మండలంలోని సత్యవరం వద్ద మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై అశోక్ బాబు తెలిపారు.

Similar News

News July 25, 2024

శ్రీకాకుళం: నెమ్మదిగా సాగుతున్న డిగ్రీ అడ్మిషన్లు

image

శ్రీకాకుళం జిల్లాలో డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ గడువు ముగిసినా ఆశించిన మేర అడ్మిషన్లు రాకపోవడంతో అధికారులు 25 వరకు గడవు పెంచారు. అంబేడ్కర్ యునివర్సిటీ పరిధిలో 74 ప్రైవేట్, 15 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 50 వేలకు పైగా సీట్లు ఉండగా ప్రస్తుతం 21 వేల మంది మాత్రమే చేరారు. ప్రభుత్వం 70 శాతం సీట్లకు మాత్రమే ఉపకార వేతనాలు చెల్లిస్తుండటడం ఇందుకు కారణమని పలువురు వాపోతున్నారు.

News July 24, 2024

శ్రీకాకుళంలో ఈ నెల 26న జాబ్ మేళా

image

జిల్లాలో బలగ జంక్షన్‌లోని ప్రభుత్వ DLTC ఐటీఐ కళాశాలలో ఈ నెల 26వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధా బుధవారం తెలిపారు. జాబ్ మేళాలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్ pvt ltd, 2050 హెల్త్ కేర్ కంపెనీలు పాల్గొంటాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ (డీజిల్, మోటర్ మెకానిక్), జిడిఏ, MPHW, ANM & GNM గల 18 నుంచి 40 సంవత్సరాల వారు అర్హులన్నారు.

News July 24, 2024

MLAకు అయ్యన్న సూచన.. నవ్విన పవన్ కళ్యాణ్

image

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ అయ్యన్న నవ్వులు పూయించారు. రోడ్ల గురించి ప్రశ్నించేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌కు స్పీకర్ అయ్యన్న అవకాశం ఇచ్చారు. ఆయన పార్టీ పెద్దలకు, మంత్రులకు, నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెబుతుండగా.. స్పీకర్ అయ్యన్న కలగజేసుకొని రోడ్ల గురించి మాట్లాడాలని సూచించారు. దీంతో ముందు వరుసులో కూర్చున్న పవన్ కళ్యాణ్‌తోపాటు సభ్యులు ఒక్కసారిగా నవ్వారు.