News August 24, 2025
నరసరావుపేటలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

నరసరావుపేటలో ఆదవారం మాంసం, కోడిగుడ్ల ధరలు ఇలా ఉన్నాయి. లైవ్ కోడి కేజీ ధర రూ. 106గా ఉంది. స్కిన్తో చికెన్ కేజీ రూ. 210 నుంచి రూ. 240, స్కిన్లెస్ అయితే రూ. 220 నుంచి రూ. 260 మధ్య విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు రూ. 10 నుంచి రూ. 20 తగ్గాయని వ్యాపారులు తెలిపారు. మటన్ కేజీ ధర రూ. 800 నుంచి రూ.900 పలుకుతోంది. అలాగే, 100 కోడిగుడ్లు రూ. 535 లభిస్తున్నాయి.
Similar News
News August 24, 2025
తిరుపతి: ఒక్కడే 53 బైకులు దొంగలించాడు!

తిరుపతిలో బైకులను మాయం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచానూరుకు చెందిన P.కుమార్ సులభ్ కాంప్లెక్స్లో పనిచేస్తుంటాడు. జల్సాలకు అలవాటై దొంగతనాలు చేస్తున్నాడు. పాత రేణిగుంట రోడ్డులో జులై 6న బైక్ దొంగతనం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేయగా కుమార్ పట్టుబడ్డాడు. తిరుపతి, చంద్రగిరి, ఏర్పేడు, శ్రీకాళహస్తి పరిధిలో రూ.40 లక్షల విలువైన 53 బైకులు దొంగలించగా వాటిని పోలీసులు రికవరీ చేశారు.
News August 24, 2025
KNR: కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ROUTE MAP

తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ అధ్యక్షతన సాయంత్రం రెండో విడత జనహిత పాదయాత్ర గంగాధర మం. ఉప్పరమల్యాల గ్రామం నుంచి కురిక్యాల వరకు, కురిక్యాల నుంచి మధురానగర్ X రోడ్ వరకు జరగనుంది. అనంతరం సాయంత్రం 7 గంటలకు మధురానగర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఉంటుందని చొప్పదండి MLA సత్యం తెలిపారు. మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొన్నం, అడ్డూరి, వివేక్ తదితరులు పాల్గొననున్నారు.
News August 24, 2025
నరసన్నపేట: ఎరువుల దుకాణాల్లో ముమ్మర తనిఖీలు

నరసన్నపేట మండల కేంద్రంలో ఉన్న పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ జిల్లా జేడీ త్రినాథ స్వామి తమ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆదివారం జరిగిన ఈ సోదాల్లో ఏడీ వెంకట మధు, ఏవో సూర్య కుమారిలు ఉన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జేడీ దుకాణదారులకు హెచ్చరించారు. రైతులకు అందుబాటులో ఎల్లవేళలా ఎరువులు ఉంచాలన్నారు.