News April 22, 2025
నరసరావుపేటలో గంజాయి తాగి వ్యక్తి హల్చల్

నరసరావుపేటలో గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువయ్యాయని ప్రజలు వాపోతున్నారు. సోమవారం రాత్రి బరంపేట స్కూల్ వద్ద తనకు గంజాయి కావాలంటూ దుకాణంలో ప్రవేశించి మహిళను బెదిరిస్తూ యువకుడు హల్చల్ చేశాడు. తమ వద్ద గంజాయి లేదని చెప్పినా వినిపించుకోకుండా మహిళతో పాటు వారి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డాడు. వారించిన స్థానికులపై రాళ్లతో దాడి చేసి భయాందోళనకు గురిచేశాడు. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News April 22, 2025
KNR: సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు నిరాకరణ

KNR SU పరిధిలోని డిగ్రీ SEM పరీక్షల నిర్వహణకు సహకరించబోమని ప్రైవేట్ కళాశాలల సంఘం SUPMA తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పరీక్ష ఫీజులు చెల్లించామని, రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న RTF, MTF బకాయిల విడుదలపై స్పష్టత వచ్చేవరకు పరీక్షల నిర్వహణను నిరాకరిస్తున్నట్లు SUPMA రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి శ్రీపాద నరేశ్ SU అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.
News April 22, 2025
వరంగల్: తేలనున్న 12,321 మంది విద్యార్థుల భవితవ్యం!

వరంగల్ జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో ఈ ఏడాది 12,321 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మొదటి సంవత్సరం జనరల్లో 4,967 మంది, ఒకేషనల్- 848, ద్వితీయ సంవత్సరం జనరల్-5,739, ఒకేషనల్ 767 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను వేగంగా Way2News యాప్లో చూసుకోవచ్చు. #SHARE IT
News April 22, 2025
విశాఖలో నేటి కాయగూరల ధరలు

విశాఖలోని 13 రైతు బజార్లలో కొనుగోలు చేసే కూరగాయల ధరలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు మంగళవారం ఈ విధంగా నిర్ణయించారు. ఉల్లి రూ.18, వంకాయలు రూ. 15, బంగాళాదుంపలు రూ.18,కాకరకాయ రూ.30,బీరకాయలు రూ.32, బెండకాయలు రూ.22,క్యాబేజీ రూ.15,గోరు చిక్కుడు రూ.32,పొటల్స్ రూ.30,కాప్సికం రూ.40,టమాటా రూ.16, క్యారట్ రూ.26/28,దొండకాయలు రూ.18, బీన్స్ రూ.48,కీర దోస రూ.20, చేమ దుంపలు రూ.32, మిర్చి రూ.24గా ఉన్నాయి.