News March 21, 2024
నరసరావుపేటలో గోపిరెడ్డిదే రికార్డ్ మెజార్టీ

నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 1952 నుంచి 15 సార్లు ఎన్నికల జరిగాయి. గత ఎన్నికల్లో గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిదే ఇప్పటి వరకు భారీ మెజార్టీ. టీడీపీ అభ్యర్థిపై ఆయన 32,277 ఓట్ల మెజార్టీతో 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో కోడెల శివప్రసాదరావు(1985)ది అత్యల్ప మెజార్టీ 2,065. రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి మరోసారి గోపిరెడ్డి బరిలో ఉండగా, TDP కూటమి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
Similar News
News September 27, 2025
అతిసార వ్యాధి నియంత్రణలో ఉంది: కలెక్టర్

గుంటూరు జిల్లాలో అతిసార వ్యాధి నియంత్రణలో ఉందని కలెక్టర్ ఎం. తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ చెప్పారు. జిల్లాలో మొత్తం 177 కేసులు నమోదయ్యాయని, వాటిలో 152 కేసులు గుంటూరు పట్టణం నుంచి, 25 కేసులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాయని ఆమె వివరించారు. ఈ వ్యాధిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారన్నారు.
News September 27, 2025
అమరావతిలో IIULER ఏర్పాటుకు AP అసెంబ్లీ ఆమోదం

అమరావతిలో IIULER ఏర్పాటుకు AP అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభానికి రంగం సిద్ధం చేయనున్నారు. క్యాంపస్ కోసం నామమాత్రపు లీజుకు (₹1/చ.మీ) 55 ఎకరాలు కేటాయించారు. AP విద్యార్థులకు 20% సీట్లు రిజర్వు చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ నిబంధనలు ఉంటాయని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ కింద నడుస్తుంది. అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టారు.
News September 26, 2025
ANU: పీజీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. జులై నెలలో జరిగిన డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఎంఏ డాన్స్, ఎంఏ డాన్స్ కూచిపూడి పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 13వ తేదీ లోపు రూ.1,860 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సంప్రదించాలన్నారు.