News February 4, 2025
నరసరావుపేట: అంగన్వాడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి

పేద కుటుంబాల వారు తమ పిల్లలను అంగన్వాడీ సెంటర్ల ద్వారా చదివించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సూచించారు. మంగళవారం పేద కుటుంబాలకు చెందిన వారికి మూడు చక్రాల రిక్షాలను అందజేశారు. పేదరికం నుంచి చదువు మాత్రమే బయటికి తీసుకువస్తుందన్నారు. చిన్నారులను చిత్తు కాగితాలు ఏరుకునేందుకు పంపవద్దని తల్లిదండ్రులను కలెక్టర్ కోరారు. ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో మధులత ఉన్నారు.
Similar News
News February 24, 2026
సూర్యోదయ తిథి ఆధారంగా పండుగలు ఎందుకు?

హిందూ క్యాలెండర్ ప్రకారం పండుగలు, ఉపవాసాలు తిథులపై ఆధారపడి ఉంటాయి. తిథి అనేది సూర్యచంద్రుల గమనాన్ని బట్టి మారుతుంటుంది. అందుకే ఇది ఇంగ్లీష్ తేదీలలా 24 గంటలు స్థిరంగా ఉండదు. అయితే సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటుందో ఆ రోజంతా అదే తిథిగా పరిగణిస్తారు. పగలు జరుపుకొనే పండుగలను ఆరోజే నిర్వహిస్తారు. రాత్రిపూట జరుపుకొనే పండుగలకు మాత్రం ఆయా సమయాల్లో ఉన్న తిథిని బట్టి జరుపుతారు.
News February 24, 2026
HYD: 3 కార్పొరేషన్ల వెబ్ సైట్లు ఇవే!

300 డివిజన్లతో కూడిన GHMC మూడుముక్కలైన విషయం తెలిసిందే. GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు సంబంధించిన వెబ్సైట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. GHMC వెబ్సైట్ www.ghmc.gov.in, సైబరాబాద్ కార్పొరేషన్ cmc.telangana.gov.in, మల్కాజిరి కార్పొరేషన్ mmc.telangana.gov.in వెబ్సైట్లలో ప్రజలు సేవలు పొందొచ్చని అధికారులు తెలియజేశారు.
# SHARE IT
News February 24, 2026
శ్రీవేంకటేశ్వర కాలేజీలో ఉద్యోగాలు

ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన శ్రీ వేంకటేశ్వర కాలేజీలో 3 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ(లైబ్రరీ సైన్స్/ఇన్ఫర్మేషన్ సైన్స్), NET, PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://svc.ac.in


