News March 22, 2025

నరసరావుపేట: ఈవీఎం గోడౌన్‌ల తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల గోడౌన్‌లలో భద్రపరిచిన ఈవీఎంలను శనివారం తనిఖీ చేశారు. గోడౌన్లలో సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు. సాధారణ త్రైమాసిక తనిఖీలలో భాగంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. గోడౌన్‌లలో ఈవీఎంలను భద్రంగా ఉంచాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మురళి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 23, 2025

ఇలాగే ఆడితే ఈసారి కప్ మాదే: పాటీదార్

image

IPL 2025 సీజన్‌లో RCBకి తొలి గెలుపు అందించిన కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడారు. ‘టోర్నీలో ఇలాగే గెలుచుకుంటూ పోతే టైటిల్ మాదే. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కావడంతో కొంత ఒత్తిడికి గురయ్యా. కోహ్లీలాంటి ఆటగాడు జట్టులో ఉండటం అదృష్టం. అతడు క్రీజులో ఉంటే కెప్టెన్ పని సులువవుతుంది. విరాట్ నుంచి నేర్చుకునేందుకు ఇది నాకు ఓ గొప్ప అవకాశం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా KKRతో మ్యాచులో పాటీదార్ 34 పరుగులు చేశారు.

News March 23, 2025

ఫిలింనగర్‌: తల్లి డైరెక్షన్‌లో కొడుకుల చోరీ

image

ఫిలింనగర్ PS పరిధిలో ఇటీవల డైమండ్‌హిల్స్ కాలనీలో 32 తులాల బంగారం, రూ.4.5 లక్షల నగదు చోరీ అయింది. లేడీ డాన్ సనా బేగం ఈ చోరీ చేయించి, 10 తులాల బంగారం విక్రయిస్తూ రెండో కొడుకు సొహాయిల్‌తో సహా పట్టుబడింది. మిగిలిన ఇద్దరు కొడుకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సనాపై ఇప్పటివరకు 43 చోరీ కేసులు ఉన్నాయి. తల్లి డైరెక్షన్ ఇస్తే కొడుకులు రంగంలోకి దిగి చోరీలు చేస్తున్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తేల్చారు.

News March 23, 2025

ఫిలింనగర్‌: తల్లి డైరెక్షన్‌లో కొడుకుల చోరీ

image

ఫిలింనగర్ PS పరిధిలో ఇటీవల డైమండ్‌హిల్స్ కాలనీలో 32 తులాల బంగారం, రూ.4.5 లక్షల నగదు చోరీ అయింది. లేడీ డాన్ సనా బేగం ఈ చోరీ చేయించి, 10 తులాల బంగారం విక్రయిస్తూ రెండో కొడుకు సొహాయిల్‌తో సహా పట్టుబడింది. మిగిలిన ఇద్దరు కొడుకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సనాపై ఇప్పటివరకు 43 చోరీ కేసులు ఉన్నాయి. తల్లి డైరెక్షన్ ఇస్తే కొడుకులు రంగంలోకి దిగి చోరీలు చేస్తున్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తేల్చారు.

error: Content is protected !!