News February 19, 2025

నరసరావుపేట: ఈ కొండపై పరమశివుడు తపస్సు చేశాడు

image

మహాశివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్ల ఘనంగా నిర్వహిస్తారు. దీనిని త్రికోటేశ్వర ఆలయం అని కూడా అంటారు. దక్షయజ్ఞంలో జరిగిన అవమానం కారణంగా సతీ దేవి దేహత్యాగం చేస్తుంది. సతీదేవి వియోగం తర్వాత పరమశివుడు ముల్లోకాలు తిరిగి కోటప్పకొండ చేరుకున్నాడు. పరమశివుడు బాల దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. బాల దక్షిణామూర్తి రూపంలో తపస్సు చేసిన ఆ పవిత్ర స్థలమే త్రికోటేశ్వరాలయముగా పేరుగాంచింది.

Similar News

News November 6, 2025

తడిసిన ధాన్యం కొంటాం: ఢిల్లీరావు

image

AP: 17% వరకు తేమ ఉన్న ధాన్యాన్నీ కొంటామని సివిల్ సప్లై కార్పొరేషన్ MD ఢిల్లీరావు రైతులకు హామీ ఇచ్చారు. వివిధ రైతు సంఘాల నేతలు ఆయన్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మద్దతు ధరకు అదనంగా గోనె సంచులు, రవాణా ఖర్చులివ్వాలని రైతులు కోరారు. మిల్లర్ల యాజమాన్యాల నుంచి వేధింపులను అడ్డుకోవాలన్నారు. పంటనష్ట పరిహారం, ధాన్యం కొనుగోలు, తేమశాతం అంచనాపై సమస్యలుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఢిల్లీరావు రైతులకు తెలిపారు.

News November 6, 2025

గోరింటాకు ధరించడం వెనుక శాస్త్రీయత

image

పెళ్లిళ్లు, పండుగలప్పుడు ఆడపిల్లలు గోరింటాకు ధరించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే, ఈ ఆచారం వెనుక కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. గోరింటాకు అనేది ఓ ఔషధ మూలిక. పెళ్లి చేసుకున్నప్పుడు నూతన వధువులో సహజంగానే కాస్త భయం, ఆందోళన ఉంటుంది. ఆ ఫీలింగ్స్‌ను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఒంట్లో వేడిని తగ్గించి, నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.

News November 6, 2025

నేడు బిహార్‌లో తొలి దశ ఎన్నికలు

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో(NOV 6, 11) పోలింగ్ జరగనుంది. ఇవాళ తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో 3.75 కోట్ల మంది ఓటర్లు 16 మంది మంత్రులు సహా మొత్తం 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. రెండు విడతల పోలింగ్ అయ్యాక NOV 14న ఓట్లు లెక్కించనున్నారు.