News April 9, 2024
నరసరావుపేట ఎన్నికలలో బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్

రానున్న సార్వత్రిక ఎన్నికలలో పీఓలు భయంతో కాకుండా బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో పిఓలు, ఏఎల్ఎంటీలకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పోలింగ్ జరిగే రోజున జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఎదురైతే చాకచక్యంగా వ్యవహరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు.
Similar News
News April 3, 2025
ఉదయం 8 తర్వాత హెవీ వెహికల్స్కు ప్రవేశం లేదు: ట్రాఫిక్ డీఎస్పీ

ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు హెవీ వెహికల్స్ గుంటూరులోకి ప్రవేశించడానికి అనుమతి లేదని ట్రాఫిక్ డీఎస్పీ రమేశ్ స్పష్టం చేశారు. బుధవారం డీఎస్పీ తన కార్యాలయంలో నగరంలోని హెవీ వెహికల్స్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. రాత్రి 10:00 నుంచి ఉదయం 8 గంటల లోపు మాత్రమే హెవీ వెహికల్స్ నగరంలోకి ప్రవేశం ఉందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సీఐ సింగయ్య పాల్గొన్నారు.
News April 3, 2025
వసతీ గృహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, వసతీ గృహాల్లో బాల, బాలికలు, మహిళల పై నేరాల నియంత్రణ కోసం ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలోని డీఆర్సీ మీటింగ్ హాలులో బుధవారం ఎస్పీ సతీశ్ కుమార్తో కలిసి నేరాల నియంత్రణ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వసతీ గృహాల స్వాగత ద్వారంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News April 2, 2025
బస్సుల అనుమతులకు రిమార్కులు అందించండి- కలెక్టర్

రవాణా శాఖ అధికారులతో గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. గుంటూరులో ప్రైవేటు సిటీ బస్సుల రూట్ల అనుమతులకు సంబంధించి సమావేశం నిర్వహించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టర్, ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. సిటీ బస్సుల అనుమతులకు సంబంధించి ఆర్టీసీ అధికారులు ఏప్రిల్ 9 నాటికి రిమార్కులు అందించాలని ఆదేశించారు. అనంతరం అనుమతుల మంజూరుకు ఆర్టీఏ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు.